Sunday, 15 March 2020

ఎంతో ముఖ్యమైన రోజు.. కరోనా నాశనం చేసింది: అడివి శేష్ ఆవేదన

ప్రమాదకరమైన కరోనా వైరస్ (కోవిడ్ 19) భయంతో ప్రపంచం వణికిపోతోంది. ఈ మహమ్మారి మరింత వ్యాప్తి చెందకుండా అన్ని దేశాలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. భారత ప్రభుత్వం కూడా ఎంతో అప్రమత్తమైంది. తెలంగాణలో కరోనా ప్రభావం అంత ఎక్కువగా లేకపోయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా జనాలు ఎక్కువగా గుమిగూడి ఉండే ప్రదేశాలు.. అంటే థియేటర్లు, క్లబ్‌లు, షాపింగ్ మాల్స్, పార్కులను మార్చి 21 వరకు, అన్ని విద్యాసంస్థలను మార్చి 31 వరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ప్రభావం సినిమా రంగంపై పడుతోంది. ఇప్పటికే కరోనా భయంతో ప్రజలు థియేటర్లకు రావడంలేదు. దీంతో ఈ మధ్య కాలంలో విడుదలైన చిన్న సినిమాలన్నీ భారీగా నష్టపోయాయి. ఇప్పుడు వారం రోజులపాటు థియేటర్లన్నీ మూతబడనున్నాయి. మరోవైపు, చిరంజీవి తన సినిమా షూటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ నైతిక బాధ్యతతో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ తన సినిమా షూటింగ్‌ను వాయిదా వేస్తున్నానని చిరంజీవి చెప్పారు. అయితే, కరోనా వైరస్ తెచ్చిన తలనొప్పి వల్ల ఒక ముఖ్యమైన రోజును జరుపుకోలేకపోతున్నామని నటుడు, రచయిత, దర్శకుడు అడివి శేష్ ఆవేదన వ్యక్తం చేశారు. Also Read: ‘గూఢచారి’ లాంటి హిట్ సినిమా తరవాత అడివి శేష్ చేస్తున్న చిత్రం ‘మేజర్’. సోనీ పిక్చర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్షన్స్ సమర్పణలో టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు నిర్మాణ సంస్థ జి. మ‌హేష్‌ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (జీఎంబీ), ఎ+ఎస్ మూవీస్ సంయుక్తంగా ‘మేజ‌ర్’ సినిమాను నిర్మిస్తున్నాయి. తెలుగు, హిందీ భాష‌ల్లో ఈ సినిమా రూపొందుతోంది. 26/11 ముంబై దాడుల్లో ప్రాణ త్యాగం చేసిన ఎన్ఎస్‌జీ కమాండో మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత‌ం ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. శశి కిరణ్ తిక్క ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 19న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇదిలా ఉంటే ఆదివారం (మార్చి 15న) మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జయంతి. ఇంత గొప్ప రోజున గౌరవ సూచికంగా ‘మేజర్’ సినిమాకి సంబంధించి ఒక ప్రకటన చేద్దామని చిత్ర యూనిట్ భావించింది. కానీ, కరోనా వైరస్ తమ ప్రణాళికలను నాశనం చేసిందని హీరో అడివి శేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. Also Read: ‘‘ఈరోజు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జయంతి. మా టీమ్‌కు, దేశానికి ఇది ఎంతో ముఖ్యమైన రోజు. ఆయన జీవితం, త్యాగం నాకో పాఠం, స్ఫూర్తి. ఇంత గొప్పరోజు గౌరవార్థం ‘మేజర్’ సినిమాకు సంబంధించి భారీ ప్రకటనలు చేద్దామని మేం ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. కానీ, కోవిడ్-19 మా ప్రణాళికలను నాశనం చేసింది. త్వరలోనే మీకు అప్‌డేట్ ఇస్తాం. జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి. ఆయన జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకోవడానికి ఒక్క క్షణం తీసుకుందాం. మన సైనికుల త్యాగాన్ని మనం ఎప్పటికీ మరిచిపోకూడదు. జై హింద్’’ అని తన ట్వీట్‌లో అడివి శేష్ పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cUlWY9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...