Monday, 9 March 2020

ద‌ర్శకురాలిగా మారిన న‌టి క‌ళ్యాణి.. మద్దతుగా పూరి జగన్నాథ్

అశ్లీలతకు దూరంగా, సంప్రదాయబద్ధమైన పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి కళ్యాణి. మలయాళ సినీ పరిశ్రమలో బాలనటిగా అడుగుపెట్టి ఆ తరవాత హీరోయిన్‌గా ఎదిగి దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటించారామె. ‘శేషు’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కళ్యాణి.. తొలి సినిమాతోనే ఆకట్టుకున్నారు. ‘ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు. వెంకటేష్‌తో ‘వసంతం’ సినిమాలో నటించారు. హీరోయిన్‌గానే కాకుండా వదినగా, తల్లిగా కూడా నటించారు కళ్యాణి. తెలుగులో చివరిగా ‘యాత్ర’ సినిమాలో కళ్యాణి కనిపించారు. నటిగా సుధీర్ఘ ప్రయాణం చేసిన కళ్యాణి ఇప్పుడు దర్శక నిర్మాతగా మారారు. తెలుగులో 25కు పైగా చిత్రాల్లో నటించిన కళ్యాణి.. ఇప్పుడు కే2కే ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వాస్తవ ఘ‌ట‌న‌ల ఆధారంగా విల‌క్షణ ప్రేమ‌క‌థ‌తో సైక‌లాజిక‌ల్ థ్రిల్లర్‌గా క‌ళ్యాణి తీస్తున్న ఈ సినిమా తెలుగు, త‌మిళ ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. హోలీ పర్వదినాన్ని పురష్కరించుకుని ఈ సినిమా ప్రీ లుక్, టీజర్ గ్లింప్స్‌ను డైన‌మిక్ డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాథ్ సోమవారం విడుదల చేశారు. Also Read: ఈ సినిమాలో చేత‌న్ శీను, సిద్ధి, సుహాసిసి మ‌ణిర‌త్నం, రోహిత్ ముర‌ళి, శ్వేత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వర‌లోనే ఈ సినిమా షూటింగ్ మొద‌లు కానుంది. కళ్యాణిని మలయాళంలో కావేరి అని కూడా పిలుస్తారు. అందుకే.. ఈ చిత్ర దర్శకురాలిగా ఆమె పేరును కావేరి కళ్యాణిగా పరిచయం చేసుకుంటున్నారు. నటిగా సక్సెస్‌ను అందకున్న కళ్యాణి.. దర్శక నిర్మాతగానూ విజయం సాధించాలని కోరుకుందాం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TQ6GCU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...