అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందే సంగీత దర్శకుడు తమన్ అందించిన ఆల్బమ్ సూపర్ హిట్ అయ్యి్ంది. ‘సామజవరగమన’ పాట మంచి మెలోడీగా పాపులర్ అయితే.. ‘రాములో రాములా’ సాంగ్ మాస్ ఆడియన్స్ బాగా ఆకట్టుకుంది. కాసర్ల శ్యామ్ రచించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, మంగ్లి ఆలపించారు. తెలంగాణ యాసలో అనురాగ్ కులకర్ణి ఈ పాటను చాలా బాగా పాడారు. అయితే, ఇప్పుడు ఈ పాటను ప్రముఖ ర్యాప్ సింగ్ బాబా సెహగల్ ఆలపించారు. తన స్టైల్లో ర్యాప్ను మిక్స్ చేసి బాబా సెహగల్ ఆలపించిన రాములో రాములా పాటను ఆదిత్య మ్యూజిక్ సంస్థ తమ యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసింది. అయితే, ఈ పాటపై విమర్శలు వస్తున్నాయి. ఒక మంచి పాటను బాబా సెహగల్ కూనీ చేసేశారంటూ సంగీత ప్రియులు విమర్శిస్తున్నారు. ఇక యూట్యూబ్లో వీడియో కింద వస్తున్న కామెంట్లు చూస్తే ఎవ్వరికైనా నవ్వు ఆగదు. అంత దారుణంగా బాబా సెహగల్ను ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఈ పాటలోని పదాలను బాబా సెహగల్ సరిగ్గా పలకలేకపోతున్నారు. దానికి కారణం అవన్నీ అచ్చతెలుగు తెలంగాణ మాండలిక పదాలు కావడమే. ఏదో ఇంగ్లిష్, హిందీతో కలిపి కొట్టిన సాహిత్యమైతే బాబా సెహగల్కు పాడటం సులభమే.. కానీ ఇలాంటి సాహిత్యం ఆయన నోటిలో తిరగదు. Also Read: అసలు ఇంత పాపులర్ అయిన, కొన్ని కోట్ల మంది ఎంతో ఇష్టపడిన పాటను ఇలా కూనీ చేయడానికి ఆదిత్య మ్యూజిక్ ఎందుకు ధైర్యం చేసిందో అర్థం కావడంలేదు. బహుశా పాపులర్ సాంగ్ కదా ఇలా కూడా దీన్ని వాడుకోచ్చు అని అనుకుందేమో. కానీ, ప్రయోగం బెడిసికొట్టింది. నిజానికి బాబా సెహగల్ గొప్ప ర్యాప్ సింగర్. ఆయన తెలుగులో చాలా పాటలు పాడారు. మెగాస్టార్ చిరంజీవి ‘రిక్షావోడు’ సినిమాలో ‘రూపు తేరా మస్తానా’ సాంగ్తో బాబా సెహగల్ టాలీవుడ్కు వచ్చారు. ఆ తరవాత ‘జల్సా’లోని టైటిల్ సాంగ్తో బాబా పాపులర్ అయ్యారు. తెలుగులో దేవీశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో ఎక్కువ పాటలు ఆలపించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TxUkjL
v
No comments:
Post a Comment