ఆ దేశంలో అతనో ప్రముఖ రచయిత.. అలాంటి ఇలాంటి రచయిత కాదు.. ‘మమైర్స్ ఆఫ్ పాబ్లో నెరుడా’ అనే పుస్తకంతో దేశ వ్యాప్తంగా పేరుగడించారు. ఈ పుస్తకం అతని ఆత్మకథే.. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారాయన. ఒకసారి శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు ఓ తమిళ పని మనిషిపై అత్యాచారం చేసి పాడుచేశానని స్వయంగా ఆయనకు ఆయనే పుస్తకంలో రాసుకున్నారు. వారెవ్వా.. ఇలాంటివి కూడా వదలకుండా రాసుకున్న ఆ ప్రముఖుడు ఎవరు అంటే.. చీలీ దేశపు ప్రముఖ రచయితల్లో ఒకరైన పాబ్లో నెరుడా ఈ ఘనకార్యం చేసిన వ్యక్తి. ఇంతవరకూ బాగానే ఉంది.. కాని మరి ఆ పుస్తకం మన వివాదస్పద శ్రీపాద కంటపడటంతో తుక్కురేగ్గొడుతూ ట్వీట్ పెట్టింది. ఇటీవల ప్రముఖ రచయిత, దౌత్య వేత్త హోదాలో ఉన్న పాబ్లో నేరుడా తమిళ పనిమనిషిని రేప్ చేశా అంటూ తన ఆత్మకథలో రాసుకున్న విషయం నాదృష్టికి వచ్చింది.. అంతా అయిపోయిన తరువాత ఆ ఘటనతో పశ్చాత్తాపం పడుతున్నానని అనడం సమజసమేనా.. ఇలాంటి వాళ్లను మహానుభావులుగా అభివర్ణించడం మన కర్మ’ అంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ వదిలింది సింగర్ చిన్మయి. Read Also:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UOEfG2
v
No comments:
Post a Comment