సినీ దర్శకుడు వి.వి.వినాయక్కు తెలంగాణ సర్కారు షాకిచ్చింది. రాజేంద్రనగర్ సమీపంలోని వట్టినాగులపల్లిలో ఆయన నిర్మిస్తోన్న భవంతిని అధికారులు కూల్చేశారు. నిర్మాణ పనులు పూర్తయ్యాక ఆ ఇంట్లోకి వెళ్దామని వినాయక్ భావిస్తున్నారు. కానీ అనుమతి లేకపోవడంతోనే దాన్ని కూల్చామని అధికారులు స్పష్టం చేశారు. వట్టినాగులపల్లి గ్రామపంచాయతీ పరిధిలోకి వస్తుంది. నిబంధనల ప్రకారం ఇక్కడ జీ+2 నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఉంది. కానీ వీవీ వినాయక్ జీ+6 భవంతిని నిర్మాణానికి పూనుకున్నారు. జీవో 111కు విరుద్ధంగా నిర్మాణం చేపట్టడంతో.. అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. డైరెక్టర్ నుంచి స్పందన లేకపోవడంతో ఆ భవనంలోని నాలుగు అంతస్థులను అధికారులు కూల్చివేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XwwJCN
v
No comments:
Post a Comment