Thursday 27 June 2019

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల సినిమా ప్రారంభం

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూజ కార్యక్రమాలు సికింద్రాబాద్ వినాయకుడి ఆలయంలో గురువారం జరిగాయి. ‘ఫిదా’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల.. ఆ తర్వాత ఎలాంటి కథతో వస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. వారి ఆసక్తిని డబుల్ చేస్తూ క్రేజీ కాంబినేషన్‌తో సినిమా చేయబోతున్నారు శేఖర్ కమ్ముల. ‘మజిలీ’ వంటి సూపర్ హిట్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తోన్న హీరోగా.. తన డైరెక్షన్‌లోనే వచ్చిన ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా సినిమా చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై క్రేజ్ పెరిగింది. డిస్ట్రిబ్యూటర్స్‌గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఏషియన్ వంటి పెద్ద కంపెనీ నిర్మిస్తుండటం వల్ల ఇప్పుడీ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో పాటు శేఖర్ ఎంచుకున్న తారాగణం కూడా ప్రాజెక్ట్‌కు పెద్ద ఎస్సెట్‌ అయింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుని ఈ ఏడాది ఆఖరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా, ఈ చిత్రానికి విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇతర ఇతర ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Jebn47
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...