గుంటూరు జిల్లా ఇప్పటంలో రోడ్డు విస్తరణ పేరుతో ప్రభుత్వ అధికారులు ఇళ్లను కూల్చివేయడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఇప్పటం గ్రామ ప్రజలు జనసేన ప్లీనరీకి స్థలం ఇవ్వడం వల్లే ఆ గ్రామంపై ప్రభుత్వం పగబట్టిందని.. రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను కూలుస్తోందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రభుత్వం చేస్తోన్న దౌర్జన్యాన్ని తిప్పి కొడతామని కూడా హెచ్చరించారు. అయితే, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ (Ali) స్పందించారు. పవన్ మాటలను తప్పుబట్టారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/6ml5Mfw
v
No comments:
Post a Comment