Wednesday 2 March 2022

ఆడవాళ్ళు మీకు జోహార్లు: శర్వానంద్- రష్మిక బీచ్ సాంగ్ వైరల్

యంగ్ హీరో శర్వానంద్‌ హీరోగా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందుతోన్న కొత్త సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసిన చిత్ర యూనిట్ మార్చి 4వ తేదీన ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసి ఫ్రెష్ అప్‌డేట్స్‌తో సినిమా పట్ల ఆసక్తి రేకెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ నుంచి 'ఓ మై ఆధ్య' సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. హీరో హీరోయిన్లు శర్వానంద్- రష్మికలపై బీచ్ లొకేషన్‌లో ఈ సాంగ్ షూట్ చేశారు. ఇందులోని పలు విజువల్స్ యూత్ ఆడియన్స్‌ని తెగ అట్రాక్ట్ చేస్తున్నాయి. శ్రీమణి అందించిన లిరిక్స్‌పై దేవి శ్రీ ప్రసాద్ కట్టిన బాణీలు మనసుకు హత్తుకుంటున్నాయి. దీంతో విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్ వైరల్‌గా మారింది. వరుస ప్లాప్స్‌తో సతమతమవుతున్న శర్వానంద్‌కి ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరోవైపు రష్మిక మందన వరుస హిట్స్ పట్టేస్తూ దూసుకుపోతోంది. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ వస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్లు రాధిక, ఖుష్బూ, ఊర్వశి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ విజయం పట్ల ధీమాగా ఉంది చిత్రయూనిట్. సో.. చూడాలి మరి ఈ ఆడవాళ్ళు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టిస్తారనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/78tdVIv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...