Wednesday 2 March 2022

మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబో.. రిలీజ్ డేట్‌ ఫైనల్ చేసిన మాటల మాంత్రికుడు

ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్న సూపర్ స్టార్ తన తదుపరి సినిమాను మాటల మాంత్రికుడు శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'అతడు, ఖలేజా' సినిమాలు సక్సెస్ సాధించడంతో అదే కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరోవైపు భీమ్లా నాయక్ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ చేసి సూపర్ డూపర్ హిట్ రాబట్టిన త్రివిక్రమ్.. మహేష్‌తో చేయబోతున్న ఈ సినిమా కోసం పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకున్నారట. షూటింగ్ మొదలు పెట్టడం నుంచి రిలీజ్ డేట్ వరకు ఓ అంచనాకు వచ్చారని తెలుస్తోంది. అనే వర్కింగ్ టైటిల్‌తో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అనౌన్స్‌మెంట్ వీడియోతోనే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. అయితే మహేష్ చేస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రమ్. ఈ మేరకు ఏప్రిల్ మూడవ వారం నుంచి ఈ సినిమా మొదలు పెట్టాలని సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే మహేష్ డేట్స్ తీసుకున్న ఆయన, చకచకా షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమాను నిలపాలని స్కెచ్చేశారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2023 సంవత్సరం జనవరి 6వ తేదీన ఈ సినిమా విడుదల చేయాలనీ త్రివిక్రమ్ ఫైనల్ అయినట్లు టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/FlztKJH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...