Tuesday 1 March 2022

నితిన్ జూనియర్.. వక్కంతం వంశీ పక్కా ప్లాన్!

యంగ్ హీరో సినిమాలంటే టాలీవుడ్‌లో ఓ రకమైన క్రేజ్ ఉంటుంది. జయాపజయాలను లెక్కచేయకుండా వరుస సినిమాలకు కమిటవుతూ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంటాడు నితిన్. ఈ నేపథ్యంలో నితిన్ హీరోగా రైటర్, దర్శకుడు ఓ సినిమా రూపొందిస్తున్నారట. దీనికి అనే టైటిల్ ఫిక్స్ చేసిన వంశీ.. ఈ కథను మరింత సానబడుతూ అంతా పక్కా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. గతంలో అల్లు అర్జున్ హీరోగా 'నా పేరు సూర్య' సినిమా రూపొందించి ఆశించిన ఫలితం రాబట్టని వక్కంతం వంశీ.. ఆ తరువాత దర్శకుడిగా కాస్త గ్యాప్ తీసుకొని తిరిగి ఇప్పుడు ఓ పవర్‌ఫుల్ కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో నితిన్‌ని హీరోగా తీసుకున్న ఆయన.. ఈ కథను 'పోకిరి' తరహాలో మలుస్తున్నారని ఇన్‌సైడ్ టాక్. దర్శకుడిగా ఎలాగైనా సత్తా చాటి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్టులో ఉండాలని ఫిక్సయిన వక్కంతం వంశీ ఈ సినిమా కోసం చాలా కేర్ తీసుకుంటున్నారని టాక్. ఠాగూర్ మధు నిర్మాణంలో గ్రాండ్‌గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి వీలైనంత త్వరగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. కాగా ఈ మూవీలో నటించబోయే ఇతర నటీనటుల విషయమై ఇప్పటికైతే ఎలాంటి సమాచారం లేదు. ఇకపోతే ప్రస్తుతం 'మాచర్ల నియోజక వర్గం' సినిమా చేస్తున్నాడు నితిన్. ఆయన సొంత బ్యానర్లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ అతి త్వరలో అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. తన ఇష్టసఖి శాలినిని పెళ్లాడాక నితిన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/enOPdzu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...