మెగా, నందమూరి ఫ్యాన్స్ సహా యావత్ సినీ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. ఈ మేరకు అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తూ ప్రకటన జారీ చేసింది RRR టీమ్. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే రిలీజ్పై మరో ప్రకటన చేస్తామని ప్రకటించారు మేకర్స్. దేశంలో కోవిడ్ ప్రభావం, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తుండటంతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ రన్ చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూత పడ్డాయి. రాబోయే రోజుల్లో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి తీవ్రతరం అయ్యే అవకాశాలు కనిపిస్తుండటంతో RRR యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో జనవరి 7న కూడా ఈ సినిమా రిలీజ్ కావడం లేదని కన్ఫర్మ్ అయింది. డీవీవీ దానయ్య సమర్పణలో దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ చిత్రంలో భారీ తారాగణం భాగమయ్యారు. కొమురం భీం రోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు రోల్ పోషించారు. అజయ్ దేవగన్, శ్రీయ, సముద్రఖని కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదాపడ్డ ఈ మూవీ మరోసారి ఇలా వాయిదా పడటం యావత్ ప్రేక్షకలోకంలో నిరాశ నింపింది. ఓ వైపు RRR వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ పెంచేసిన రాజమౌళి.. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. గత కొన్ని రోజులుగా తనదైన కోణంలో ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై ఉన్న ఆతృతను పెంచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి RRR వాయిదాను అధికారికంగా ప్రకటించడంతో మెగా, నందమూరి అభిమానలోకం నిరుత్సాహ పడింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zhnLd7
v
No comments:
Post a Comment