దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కోవిడ్ ఉదృతి మరోసారి జనాల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. గత నాలుగు రోజుల నుంచి రోజువారీ కేసులు మూడు లక్షలపైనే నమోదవుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు పలువురు సెలబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడుతుండటం ఆందోళనకరంగా మారింది. అయితే తాజాగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. దీంతో ఈ విషయం తెలిసి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. వారం రోజుల పాటు ఆయన ఐసోలేషన్లో ఉండనున్నారు. కొద్దిరోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండండని, ఏ మాత్రం అనారోగ్య లక్షణాలు కనిపించినా కరోనా పరీక్షలు చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోండని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో వెంకయ్య నాయుడు ఆరోగ్యం పట్ల జనసేనాని , మెగాస్టార్ రియాక్ట్ అయ్యారు. గౌరవ వెంకయ్య నాయుడు గారు కరోనా బారి నుంచి త్వరగా బయటపడాలని, వేగంగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు. గౌరవ ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కోరుకున్నారు. ''వెంకయ్య నాయుడు గారు కరోనాకు గురి కావడం విచారకరం. ఆయన త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతులై దేశ ప్రజల సేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షిస్తున్నాను'' అని పేర్కొంటూ పవన్ కళ్యాణ్ ఓ లేఖ రాశారు. మరోవైపు దేశ ప్రజలంతా వెంకయ్య నాయుడు ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35iENg8
v
No comments:
Post a Comment