Monday, 13 December 2021

‘పుష్ప’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌‌లో అలా జరగడం చాలా బాధగా ఉంది.. రష్మిక మందన ఆవేదన

నిన్న (ఆదివారం) హైదరాబాద్‌లో ‘పుష్ప’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ వేడుకకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. తమ అభిమాన హీరోహీరోయిన్లను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి హుషారెత్తిపోయారు. అయితే జనం ఎక్కువ సంఖ్యలో రావడంతో ఈ ఈవెంట్‌లో తోపులాట జరగడం వల్ల కొంతమంది గాయపడ్డారట. ఈ విషయం తెలిసి ఆవేదన చెందుతూ ట్వీట్ చేసింది. ‘పుష్ప’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌‌లో చోటుచేసుకున్న ఓ సంఘటన వల్ల తానెంతో బాధకు గురయ్యానని రష్మిక అన్నారు. నిన్న సాయంత్రం జరిగిన ఈవెంట్‌ కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని చెప్పిన రష్మిక.. ఈవెంట్‌లో తోపులాట జరగడం వల్ల కొంతమంది గాయపడ్డారని ఇప్పుడే తనకు తెలిసిందని, అందుకు ఎంతో బాధగా అనిపిస్తోందని పేర్కొంది. గాయపడ్డ ఆరోగ్యం పట్ల కేర్ తీసుకుంటారని భావిస్తున్నానంటూ ట్విట్టర్ పోస్ట్‌లో రాసుకొచ్చింది. దీంతో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. స్టైలిష్ స్టార్ హీరోగా నటించిన ఈ ‘పుష్ప’ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది. సుకుమార్‌ దర్శత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్‌ అనే ఎర్రచందనం స్మగ్లర్‌గా మాస్‌ రోల్‌లో కనిపించనున్నారు. ఆయన ప్రేయసి శ్రీవల్లి పాత్రలో పల్లెటూరి అమ్మాయిగా రష్మిక కనిపించనుంది. డిసెంబర్‌ 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ మూవీపై బన్నీ ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు మాటల్లో చెప్పలేం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31MTYNk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...