Saturday, 4 December 2021

అఖండ ఎఫెక్ట్.. సినిమా చూస్తూ ఉండగానే విషాదం.. డిస్ట్రిబ్యూటర్ మృతి

నందమూరి అభిమానులు ఇప్పుడు పండుగ చేసుకుంటున్నారు. బాలయ్య బాబు అఖండతో కొట్టిన దెబ్బకు రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. రెండో రోజుల్లోనే నలభై కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. వీకెండ్‌లో ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతాడంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేటర్ల వద్ద బాలయ్య జాతరలు జరుగుతున్నాయి. ఆన్ లైన్‌లో టికెట్లు దొరకడం లేదు. థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. అయితే ఇలా నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఓ ఫ్యాన్ కమ్ ఎగ్జిబ్యూటర్ హఠాన్మరణం చెందాడు. దీంతో అందరూ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ‘అఖండ’ సినిమా చూస్తూనే అతను మరణించడం అందరిలోనూ విషాదాన్ని నింపేసింది. అసలు జరిగింది ఏంటంటే.. తూర్పుగోదావరి జిల్లా సినీ ఎగ్జిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ప్రముఖ సినీ ఎగ్జిబిటర్‌ అయిన జాస్తి రామకృష్ణ శ్యామల థియేటర్‌లో ‘అఖండ’ సినిమా వీక్షిస్తుండగానే బ్రెయిన్‌ స్ట్రోక్ కు గురయ్యి ప్రాణాలు విడిచారు. అయితే వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. కానీ లాభం లేకుండా పోయింది. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు. రాజమండ్రి సమీపంలో ఉన్న నామవరం వీఎస్‌ మహల్‌ థియేటర్‌ ఓనర్‌గా కెరీర్‌ను ప్రారంభించి అటు తర్వా జిల్లా సినీ ఎగ్జిబ్యూటర్స్‌ అసో సియేషన్‌ అధ్యక్షుడిగా, వింటేజ్‌ క్రియేషన్స్‌ అధినేతగా రామకృష్ణ ఎదిగారు. బాలయ్య సినిమా మొత్తానికి యాభై కోట్లకు పైగా అమ్ముడు పోయింది. రెండు రోజుల్లో సగం అమౌంట్‌ను రాబట్టినట్టు తెలుస్తోంది. ఇక ఈ వీకెండ్ ముగిసే సరికి బాలయ్య ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి. యూఎస్‌లో అయితే ఏకంగా హాఫ్ మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసేశాడు బాలయ్య.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3GjHQlz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...