Wednesday, 1 December 2021

అమ్మానాన్నల తర్వాత నేను కాళ్ళు మొక్కే వ్యక్తి ఆయనొక్కడే.. అల్లు అర్జున్ ఎమోషనల్ కామెంట్స్

లిరిక్ దిగ్గజం నిన్న (మంగళవారం) సాయంత్రం 4 గంటల సమీపంలో అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అయితే ఈ రోజు (బుధవారం) సినీ ప్రముఖుల సందర్శనార్థం సిరివెన్నెల భౌతిక కాయాన్ని ఫిలిం చాంబర్‌లో ఉంచగా వచ్చి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిరివెన్నెలతో తనకున్న అనుభందాన్ని మీడియాతో పంచుకున్నారు. శాస్త్రి గారు తనకు చాలా ఇష్టమైన మాత్రమే కాదు నా కుటుంబ సభ్యుల తర్వాత ఎంతో గౌరవమైన స్థానం ఆయనకు ఉందని అన్నారు అల్లు అర్జున్. అమ్మానాన్నల తర్వాత నేను కాళ్ళు మొక్కే ఒకరిద్దరు వ్యక్తుల్లో శాస్త్రి గారు ఒకరని చెప్పారు. తనకు భాష మీద అంత పట్టు లేకున్నా ఆయన పాటలు విన్నాక తెలుగు సాహిత్యంపై గౌరవం పెరిగిందని అన్నారు. పాటతో మనసులో ఫీలింగ్స్ జొప్పించగల సమర్థుడు సీతారామ శాస్త్రి అని ఆయన పేర్కొన్నారు. ఆయనొక గొప్ప సినీ గేయ రచయిత అని, అలాంటి వ్యక్తి ఇండస్ట్రీకి మళ్ళీ మనకు దొరకరని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయామంటూ బన్నీ ఎమోషనల్ అయ్యారు. ''శాస్త్రి గారు చనిపోయింది నిన్న ఒక్కరోజే. రేపటి నుంచి ఆయన అందరి హృదయాల్లో బతికే ఉంటారు. ఆయన పాటలు.. తెలుగు చిత్ర రంగానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ జనాలు గుర్తు పెట్టుకుంటారు. అందరి మనసుల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతారు'' అన్ని అల్లు అర్జున్ అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Dg3N2F
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...