ప్రముఖ పాటల రచయిత సీతారామశాస్త్రి మంగళవారం సిరివెన్నెల పరమపదించారు. బుధవారం ఆయన పార్థివ దేహాన్ని సందర్శనార్థం ఫిలించాంబర్లో ఉంచారు. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ భౌతిక కాయానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు, మరణించడం తెలుగు సినీ పరిశ్రమకే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగువాళ్లు, ప్రపంచంలోని తెలుగువాళ్లకు తీరనిలోటు. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. దాదాపు 800 ,చిత్రాల్లో 3000 పాటలకు పైగా రాసిన గొప్ప కవి. తెలుగుదనం ఉట్టిపడేలా..ఈరోజు ఒక ఉగాది పచ్చడికానివ్వండి. అదేవిధంగా సంక్రాంతి పండుగ కానీ, దీపావళి పండుగలను మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో ఆయన పాటలు అంత గొప్పగా ఉంటాయి. సిరివెన్నెల చిత్రానికి ఆయన రాసిన పాటలకు ఆరోజుల్లో నంది అవార్డులు రావడం, ఆయన పేరు కూడా అప్పట్నుంచి సిరివెన్నెల అని పిలుస్తున్నాం. వారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. 13 సార్లు నంది అవార్డులు రావడం చాలా గొప్ప విషయం. ఈ మధ్య కాలంలో మారిన జనరేషన్లో రాసిన పాటలకు అర్థాలు కూడా తెలియడం లేదు. సిరివెన్నెలగారు రాసిన పాటలు ఎంతో కనువిప్పుగా ఉంటాయి. దాంతో పాటు అందులోని కంటెంట్, అర్థాలు కూడా మామూలు వ్యక్తికి కూడా అర్థమవుతాయి. అలాంటి మహనీయుడు ఆరోగ్యరీత్యా ఉన్న ఇబ్బందులు మూలంగా ఆయన మరణించడం బాధగా ఉంది. ఈమధ్య కాలంలో ఆయన హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఆరోగ్యం నిలకడగా ఉందనడంతో త్వరగా రికవరీ అవుతారని అనుకున్నాం. కానీ విధిరాతను తప్పించలేం. ఆయన మరణించడం ఎంతో బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. వారికి ఆ భగవంతుడు ధైర్యాన్నివ్వాలని కోరుకుంటున్నాను. వారిని ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు సినీ పరిశ్రమలోని రైటర్స్ అర్థం, పరమార్థం ఉన్న పాటలను రాయాలి. సిరివెన్నెలగారు చరిత్రలో మిగిలిపోయే వ్యక్తి. ప్రభుత్వం తరపున కూడా మా సంతాపాన్ని తెలియజేస్తున్నాను’’ అన్నారు. అలాగే సిరివెన్నెల మరణించడంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విచారాన్ని వ్యక్తం చేశారు. సిరివెన్నెలతో రెండేళ్ల అనుబంధం గురించి తెలిపారు సజ్జనార్. ‘‘సిరివెన్నెలగారితో మంచి పరిచయం ఉంది. అలాంటి రైటర్ చనిపోవడం మనకు తీరని లోటు. సైబరాబాద్ కమీషనర్గా ఉన్నప్పుడు కరోనా వచ్చింది. అయినా కూడా మేం రిక్వెస్ట్ చేశామని, పోలీసుల మీద అభిమానంతో మా ఆఫీసుకు వచ్చి పాట రాశారు. వారం రోజుల ముందు కూడా ఆయనతో మాట్లాడాను. ఇప్పుడున్న పాటల రచయితలు సిరివెన్నెలగారిని ఆదర్శంగా తీసుకోవాలి. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అన్నారు సజ్జనార్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3d7JCJQ
v
No comments:
Post a Comment