కోలీవుడ్లొ విషాదం నెలకొంది. కరోనాతో ప్రముఖ నటుడు, దర్శకుడు (61) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధ పడుతున్న ఆయన చైన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. అయితే కరోనాతో పోరాడుతూ బుధవారం ఆయన తుది శ్వాస విడిచారు. కరోనాతో పాటు గుండె పోటు కూడా తోడైందని వైద్యులు తెలిపారు. ఇక మనోహర్ మరణ వార్త తెలియడంతోనే హీరోలు, నటులు, సంగీత దర్శకులు ఇలా అందరూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. మనోహర్ మరణ వార్త తెలుసుకుని రచయిత, దర్శకుడు, నిర్మాత అయిన పాండిరాజ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గుండె బద్దలైందంటూ కంటతడిపెట్టేశారు. ఇక సంగీత దర్శకుడు ఇమ్మాన్ ట్వీట్ వేశారు. మనోమర్ లేరని తెలిసి డి ఇమ్మాన్ ఎమోషనల్ అయ్యాడు. మీ ఆత్మకు శాంతి కలగాలి ఆర్ఆన్ఆర్ మనోహర్ సర్.. ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మసిలమణి సినిమాకు ఆయనతో కలిసి పనిచేయడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. సన్ పిక్చర్స్ బ్యానర్లో నకుల్ సునయన కలిసి నటించిన చిత్రాన్ని మనోహర్ గారు ఎంతో గొప్పగా తెరకెక్కించారు అని గుర్తు చేసుకున్నాడు. ఆర్ఎన్ఆర్ మనోహర్ కోలీవుడ్లో నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1995లో `కోలంగల్` చిత్రంతో నటుడిగా తెరంగేట్రం చేశారు. దిల్, తెన్నవాన్, వీరమ్, సలీమ్, ఎన్నై అరిందాల్, నానుమ్ రౌడీ దాన్, వేదాలం, విశ్వాసం, కాంచన -3, అయోగ్య లాంటి చిత్రాల్లో నటుడిగా మెప్పించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YYVGK2
v
No comments:
Post a Comment