కన్నడ పవర్ స్టార్ మరణాన్ని ఇంకా ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతోన్నారు. గత నెల29న కార్డియాక్ అరెస్ట్తో కన్నుమూయడంతో అభిమానులు విషాదంలో మునిగారు. కన్నడిగులు మాత్రమే కాకుండా పునీత్ మరణంపై దేశం మొత్తంలో సినీ ప్రేమికులు విచారాన్ని వ్యక్తం చేశారు. తెలుగు, తమిళ సినీ సెలెబ్రిటీలు, ప్రేక్షకులు ఇలా అందరూ పునీత్ రాజ్ కుమార్ మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇక కన్నడ నాట పునీత్ రాజ్ కుమార్ సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. కన్నడ రత్న అవార్డుతో పునీత్కు నివాళిని అర్పించారు. అయితే తాజాగా ఆయన భార్య తాజాగా ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. ఇన్ స్టాగ్రాంలో ఆమె షేర్ చేసిన ఈ పోస్ట్ అభిమానులు చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. ‘శ్రీ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం మా కుటుంబ సభ్యులకే కాదు.. మొత్తం కర్ణాటక ప్రజలకు షాకింగ్గా ఉందని ఆమె అన్నారు. ఆయన్ను ‘పవర్స్టార్’ చేసిన అభిమానులకు పునీత్ లేనిలోటు ఊహించడం కష్టమేనని తెలిపారు. ఈ బాధలో మీరు మనోనిబ్బరం కోల్పోకుండా ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలకు తావివ్వకుండా, గౌరవంగా పునీత్కు అంతిమ వీడ్కోలు పలికారని అభిమానులను ఉద్దేశించి అన్నారు. సినీప్రియులు మాత్రమే కాకుండా భారతదేశంతో పాటు విదేశాల నుంచి ఆయనకు నివాళులు అర్పించేందుకు వచ్చారని తెలిపారు. అప్పు(పునీత్)ని వేలాది మంది ఫాలో అవ్వడం, ఆయనలా నేత్రదానానికి ముందుకు రావడం.. మీ మనసులో అప్పుకు ఉన్న స్థానం చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయని ఎమోషనల్ అయ్యారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని మీరు చేసే మంచి పనుల్లో పునీత్ జీవించే ఉంటారని అన్నారు .మీ ప్రేమ, మద్దతు కోసం మా మొత్తం కుటుంబం తరఫున అభిమానులకు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని అశ్వినీ పునీత్ రాజ్ కుమార్ ఎమోషనల్ అయ్యారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oFTPmb
v
No comments:
Post a Comment