నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి దేవిని ఉద్దేశించి అసెంబ్లీలో పాలక పక్ష సభ్యులు అవమానకరంగా మాట్లాడారని మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. ఈ వ్యవహారంతో తెలుగు దేశ కార్యకర్తలు, నందమూరి అభిమానులు తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. అసలు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి.. అందులోనూ మహిళ గురించి అలా అసెంబ్లీలో దూషించడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో జరిగిన ఘటనను ఖండిస్తూ నందమూరి కుటుంబానికి చెందిన హీరో ఖండిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘‘మాట్లాడే మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వ సాధారణం. ఈ విమర్శలు, ప్రతి విమర్శలు ప్రజా సమస్యలపై జరిగాలి కానీ..వ్యక్తిగత దూషణలు, విమర్శలు పరంగా ఉండకూడదు. నిన్న(శుక్రవారం) అసెంబ్లీలో జరిగిన ఓ ఘటన నా మనసుని కలిచివేసింది. ఎప్పుడైతే మనం ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో, ముఖ్యంగా.. మన ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడుతున్నామో, అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది. అది తప్పు. ఆడపడుచులను గౌరవించడం అనేది మన సంస్కృతి. మన నవనాడుల్లో, జవజీవాల్లో, రక్తంలో కలిసి పోయిన సంప్రదాయం. మన సంప్రదాయాలను రాబోయే తరానికి చాలా జాగ్రత్తగా అప్పచెప్పాలే కానీ, సంస్కృతిని కలచివేసి, కాల్చేయకూడదు. ఈ మాటలను వ్యక్తిగత దూషణకు గురైనటువంటి కుటుంబ సభ్యుడిగా మాట్లాడలేదు. ఈ మాటలను ఓ కొడుకుగా, భర్తగా, తండ్రిగా, పౌరుడిగా, సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను. రాజకీయ నాయకులకు ఒకటే విన్నపం. దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి. ప్రజా సమస్యలపై పోరాడండి. రాబోయే తరానికి బంగారు బాట వేసేలా మన నడవడిక ఉండేలా జాగ్రత్త పడండి. ఇది నా విన్నపం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటున్నాను’’ అన్నారు. ఇదే ఘటనపై పాలక పక్షం నుంచి మంత్రి పేర్ని నాని కూడా మీడియా ముఖంగా స్పందించారు. అసలు భువనేశ్వరి దేవి గురించి అసెంబ్లీ ఎవరు మాట్లాడలేదని, కానీ చంద్రబాబు నాయుడు ఎందుకలా స్పందించారో ఆయనకే తెలియాలని, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన వీడియో ఉంటుంది. అందులో కూడా చెక్ చేసుకోవచ్చునని నాని తెలిపారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oOwWNd
v
No comments:
Post a Comment