కన్నడ నటుడు, దివంగత పునీత్ రాజ్కుమార్కు మరణాంతరం అరుదైన గౌరవం దక్కింది. అప్పుగా ఫేమస్ అయిన ఆయన్ను ప్రతిష్ఠాత్మక '' అవార్డుతో సత్కరించనున్నట్లు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. పునీత్ రాజ్ కుమార్ తరఫున ఆయన కుటుంబ సభ్యులు ఈ అవార్డును స్వీకరించనున్నారు. నటుడిగా అలరిస్తూనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు పునీత్. వేలాది మందికి విద్యాదానం చేయడంతో పాటు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ ఆపద్బాంధవుడిగా కీర్తి గడించారు. అనాథశ్రమాలు, గోశాలలు నిర్వహించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నైజంతో ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. అక్టోబరు 29న పునీత్ గుండె పోటుతో మరణించారు. ఆయన ఆకస్మిక మరణం అభిమానులను, యావత్ సినీలోకాన్ని ఎంతగానో కలచివేసింది. సమాజం కోసం పునీత్ చేసిన కృషిని గుర్తించి ‘కర్ణాటక రత్న’, ‘బసవ పురస్కార’ అవార్డులు ఇవ్వాలని కోరుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి పునీత్ అభిమానులు ఇటీవల లేఖలు రాశారు. పలువురు మంత్రులు కూడా ఇదే విషయాన్ని కోరారు. అయితే మరణాంతరం పునీత్కు తాజాగా ‘కర్ణాటక రత్న’ అవార్డు వరించడం పట్ల ఆయన అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kEv9JG
v
No comments:
Post a Comment