మెగాస్టార్ తాజాగా యోధా లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవంలో చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. మరణంపై చిరంజీవి స్పందించాడు. స్వర్గీయ రాజ్ కుమార్ నుంచి పునీత్ రాజ్ కుమార్ వరకు వారింట్లో ఉన్న ఆరోగ్య సమస్యలపై కొన్ని కామెంట్లు చేశాడు. రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించారు.. ఆయన కుమారులందరికీ గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడ్డారన్న విషయంతెలిసిందే. ఇక పునీత్ రాజ్ కుమార్ విషయంలోనూ ఇలా అకస్మాత్తుగా జరిగింది. వారసత్వ వ్యాధిగా వారందరికీ ఈ గుండెపోటు అనేది వస్తోంది. ఇదే విషయాన్ని చిరంజీవి ప్రస్థావించారు. మన శరీరంలో భవిష్యత్తులో కలిగే మార్పులు, భవిష్యత్తులో వచ్చే రోగాలను ముందే జీనోమో చికిత్స ద్వారా పసిగట్టవచ్చు. అలాంటి టెక్నాలజీ అందుబాటులోకి రావడం ఎంతో సంతోషం. నేను గతంలో ఇలాంటి పరీక్షలు చేయించుకున్నాను. క్యాన్సర్ ఉందనిని చెబుతారేమోనని కంగారు పడ్డాను. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆరోగ్యంగానే ఉన్నాను అని చెప్పారు. అలా ముందే రోగాలను పసిగడితే.. మరణాన్ని వాయిదా వేయోచ్చు. ఆహారపు అలవాట్లు, జీవన శైలిని మార్చుకోవచ్చు. వ్యాధి రావడాన్ని కాస్త పోస్ట్ చేయవచ్చు. ఇలాంటి చికిత్స గురించి తెలియక, అవగాహన లేక పునీత్ రాజ్ కుమార్ అలా అకస్మాత్తుగా మరణించారు. ఇది తెలిసి ఉంటే.. ముందుగానే వ్యాధిని కనిపెట్టి ఉంటే పునీత్ రాజ్ కుమార్ ఇంకా మన మధ్యే ఉండేవారు అంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. ఇదే ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. వెంకయ్య నాయుడిని రాష్ట్రపతి చూడాలనే కోరిక ఉందని అన్నాడు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/326T91r
v
No comments:
Post a Comment