Saturday, 20 November 2021

హిందీ హక్కులు అమ్మేశారు.. ‘పుష్ప’ రూమర్లకు బ్రేక్

అల్లు అర్జున్,సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతోన్న పుష్ఫ చుట్టూ ఎన్ని రూమర్లు చుట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. ప్యాన్ ఇండియా ఆశల మీద నీళ్లు చల్లినట్టేనా? అని అందరూ సెటైర్లు వేశారు. హిందీ డబ్బింగ్ సినిమాను ఎవ్వరూ కొనడం లేదు.. శాటిలైట్, యూట్యూబ్‌లోనే రిలీజ్ కానుందని వార్తలు వచ్చాయి. వాటికి తగ్గట్టే పుష్ప యూనిట్ కూడా మధ్యలో హిందీ పోస్టర్లను విడుదల చేయలేదు. పాటను కూడా విడుదల చేయలేదు. అయితే మొత్తానికి హిందీ హక్కులు అమ్ముడుపోయాయట. ఈ మేరకు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటన చేసింది. కేజీయఫ్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన AA Films India అనే సంస్థ పుష్ప హక్కులను కొనుగోలు చేసిందట. అలా మొత్తానికి పుష్పహిందీ కష్టాలు గట్టెక్కాయి. పాన్ ఇండియన్ లెవెల్‌లో పుష్ప వచ్చేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయాయి. కర్ణాటక హక్కులను స్వాగత్ అనే సంస్థ తీసుకుందట. ఇది వరకు తమిళ, మళయాల హక్కులు అమ్ముడుపోయాయి. దీంతో పుష్ప బిజినెస్ అంతా కూడా పూర్తయింది. కానీ షూటింగ్ మాత్రం ఇంకా జరుగుతూనే ఉంది. అసలు అనుకున్న సమయానికి సినిమా వస్తుందా? అన్నది కూడా అనుమానంగానే మారింది. ఇక సాంగ్ షూటింగ్ చేయాలి.. డబ్బింగ్ పనులు మిగిలే ఉన్నాయి. కానీ పుష్ప మాత్రం ప్రమోషనల్ కార్యక్రమాలు మంచి ఊపులో ఉన్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ కొట్టిన పాటలు ఇప్పటికే మార్మోగిపోతోన్నాయి. నాలుగో పాట ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా ప్రస్తుతం దుమ్ములేపేస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Dxn3d4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...