అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన సమంత గురించి, ఆమె వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో చాలా రకాలైన వార్తలు వినిపిస్తున్నాయి. సమంత పిల్లలను వద్దనుకుని అబార్షన్ చేయించుకుందని, ఇతరులతో ఆమెకు ఎఫైర్స్ ఉన్న కారణంగానే నాగచైతన్య సమంతతో విడిపోయాడంటూ న్యూస్ చక్కర్లు కొట్టాయి. వీటిపై సమంత తనదైన శైలిలో ఇన్స్టాగ్రామ్ ద్వారా బదులిచ్చారు. ‘‘నేను క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు నాకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ నేపథ్యంలో కొందరు నాపై అసత్యపు వార్తలను ప్రచారం చేశారు. అయితే చాలా మంది ఆ వార్తలను ఖండిస్తూ చాలా మంది నాకు అండగా నిలిచారు. రు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నాకు ఇతరులతో తప్పుడు సంబంధాలున్నాయని, అబార్షన్ చేయించుకున్నానని, అవకాశవాదనని కొందరు ప్రచారం చేశారు. నా జీవితంలో విడాకులు తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను దాటడానికి సమయం పడుతుంది. నాపై తప్పుడు ప్రచారం చేయడం తగదు. అయితే ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. అయితే ఇలాంటి ప్రచారం వల్ల నేను కుంగిపోను’’ అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా సమంత బదులిచ్చారు. చైతన్యతో విడాకులు తీసుకున్న సమంత కొన్ని రోజుల వరకు మీడియాకు దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే షూటింగ్లకు హాజరవుతున్నారు. రీసెంట్గానే ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంలో పాల్గొని సమంత పాతిక లక్షల రూపాయలను గెలుచుకున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BrSSD3
v
No comments:
Post a Comment