గాంధీ జయంతి రోజున రాష్ట్రంలో రోడ్లకు మరమత్తులు చేస్తామని జనసేనాని ప్రకటించారు. వివిధ పరిస్థితులను ఎదుర్కొని పవన్, జనసైనికులు రాజమహేంద్రవరంకు చేరుకున్నారు. అక్కడ తన కార్యకర్తలతో కలిసి ఆయన శ్రమదానం చేశారు. అనంతరం ఆయన సభలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం పనులు చేయనప్పుడు ప్రశ్నించడం ప్రజల హక్కు అని, ఆ హక్కును రాజ్యాంగం కల్పించిందని పవన్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల శ్రేయస్సు కోసం ముందుకు వచ్చాను. రాజకీయం అనేది చాలా కష్టమైన పని. పార్టీని నడపటం అంత సులువు కాదు. సరదా కాదు. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాను. ప్రజలకు మౌళిక వసతులను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఎందుకంటే మనం పన్నులు చెల్లిస్తున్నాం. యాక్షన్, కెమెరా, కట్ అని వచ్చి వెళ్లేవాడిని కాను. గాంధీజీ స్ఫూర్తితో ముందుకెళుతున్నాను. ఎవరో పచ్చి బూతులు తిడితే పడే వ్యక్తిని కాను. నా సహనాన్ని పరీక్ష పెడుతూ ఎన్నో మాటలన్నారు. అన్నింటినీ మౌనంగా భరించాను. ప్రతి కులంలోనూ గొప్పోళ్లు ఉంటారు. ఏ కులంలో పుట్టాలో మనం నిర్ణయించుకోలేం. కానీ ఎలా బతకాలో మనం నిర్ణయించుకోవచ్చు. కులాల పేరుతో ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. కేవలం రెండిళ్లకే రాజకీయం పరిమితమైంది. కానీ అది కరెక్ట్ కాదు. పవర్ వచ్చాకే పవర్స్టార్ అని, ముఖ్యమంత్రి అయ్యాకే సీఎం అని పిలవండి. యంత్రాంగం వారి పనిని సరిగ్గా చేయకపోతే ప్రజలు రోడ్లపైకి వస్తారు’’ అని అన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oraqLP
v
No comments:
Post a Comment