Saturday, 2 October 2021

నా మూడు సినిమాలు కూడా అలా ఆడుతాయని నమ్మకం ఉంది: నటుడు సిద్ధార్త్

ఒకప్పుడు స్టార్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనస్సు దోచుకున్న నటుడు . ‘బాయ్స్’, ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ఇలాంటి ప్రేమ కథ చిత్రాల్లో నటించి ఆయన లవర్‌ బాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయనకు హిట్ సినిమాలు కరువు అయ్యాయి. దీంతో ఆయన ప్రయోగాల బాటపట్టారు. ముఖ్యంగా తమిళంలో హారర్ జోనరలో సినిమాలు చేయడం ప్రారంభించారు. ఇందులో కొన్ని సక్సెస్ అయితే కొన్ని ఫెయిల్ అయ్యాయి. అయితే త్వరలో ‘మహాసముద్రం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు సిద్ధార్త్. ఈ సినిమాతో ఆయన కలిసి హీరోలుగా నటిస్తున్నారు. ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంతో ఓ విభిన్నమైన ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమా రూపొందింది. ఇందులో ప్రధాన హీరోయిన్లుగా అదితి రావు హైదరి, అనూ ఇమ్మాన్యూయేల్ నటిస్తుండగా.. ప్రధాన పాత్రల్లో జగపతి బాబు, రావు రమేష్ నటిస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం గాయంతో చికిత్స కోసం లండన్‌కి వెళ్లిన సిద్ధార్త్ తాజాగా చికిత్సను పూర్తి చేసుకొని హైదరాబాద్‌కి వచ్చారు. తన సినిమాకు ఆయన డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారని సమాచారం. అయితే తన సినిమా గురించి సిద్ధార్త్ తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘గత జనరేషన్‌ నుంచి వచ్చిన వాడిగా చెబుతున్నాను.. అప్పటి స్టార్స్ సినిమాలు ఒక్కోటి థియేటర్‌లో ఆరు నెలలు ఆడేవి.. అంతటి నమ్మకం నాకు సినిమాపై ఉంది. దాంతో పాటు నా రాబోయే మూడు సినిమాలు కూడా అలాగే ఆడుతాయి అని అనే అనుకుంటున్నాను’ అంటూ సిద్ధార్త్ ట్వీట్ చేశారు. ఏకే ఎంటర్టైన్ మెంట్ పతాకంపై అనిల్ సుంకర మహాసముద్రం చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 14న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kYSzdc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...