మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికల పోరు రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుతోంది. అధ్యక్ష పోటీలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఇద్దరే ఉండటంతో ఒకరిపై ఒకరి మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నెల 10వ తేదీన 'మా' ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్స్ దాఖలు చేసిన ఇరు వర్గాల ప్యానల్ మెంబర్స్ ఇక ప్రచార బరిలో దిగి దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న MAA సమస్యల పట్ల స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్కి సపోర్ట్గా ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతూ గత విషయాలు ప్రస్తావించారు శ్రీకాంత్. 'మా' అభివృద్ధి ప్రకాష్ రాజ్ వల్లే సాధ్యమవుతుందని తెలిపిన ఆయన.. కొందరు ఉద్దేశ పూర్వకంగానే సినీ పరిశ్రమలో నాన్ లోకల్ ఇష్యూ లేవనెత్తుతున్నారని, ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడుతున్నారని అన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీపై ఇతర భాషా పరిశ్రమల్లో కూడా గౌరవం ఉందని, తాము మా అసోసియేషన్ కోసం ఎంత చేసినప్పటికీ కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే ఈ సారి 'మా' ఎన్నికల్లో పోటీ చేయకూడదని అనుకున్నానని, అయితే ప్రకాష్ రాజ్ తనను కలిసి వారి ప్రణాళిక వివరించి పోటీచేయమని అడగడంతో బరిలోకి దిగానని అన్నారు. 'మా' అభివృద్ధి ప్రకాష్ రాజ్ వల్లే సాధ్యమవుతుందని శ్రీకాంత్ తెలిపారు. ఇకపోతే తాను గత ఎన్నికల్లో తాను ఓడిపోలేదని, ఓడించారని.. అందుకే ఓటమి పాలైన చోటే కసితో పని చేద్దామని నిర్ణయించుకున్నానని చెబుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు శ్రీకాంత్. 'మా' శాశ్వత భవనం కలను ప్రకాష్ రాజ్ నెరవేర్చుతారని చెప్పిన ఆయన, ఇతర అన్ని సమస్యలపై కూడా దృష్టి పెడతామని, ఒక ప్యానల్గా జెన్యూన్గా పోటీలో ఉన్నామని అన్నారు. కల్చర్లెస్ పనులు చేయబోమని, కళాకారులుగా మా మనసాక్షిని అమ్ముకోలేం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mlBtWk
v
No comments:
Post a Comment