Monday, 25 October 2021

న్యాయమూర్తిపై హీరో విజయ్ సంచలన వ్యాఖ్యలు.. నన్ను జాతి వ్యతిరేకి అనడం బాధగా ఉందన్న స్టార్ హీరో

కొన్ని నెల‌ల ముందు యూకే నుంచి దిగుమతి చేసుకున్న రోల్స్ రాయిస్ కారుపై పన్ను తగ్గించాలని కోరుతూ కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజయ్ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చెన్నై హైకోర్టు ఈ కేసును తోసిపుచ్చింది మరియు అతనికి లక్ష రూపాయల జరిమానా విధించింది. కరోనా రిలీఫ్ ఫండ్‌కు జరిమానా చెల్లించాలని కూడా ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో న్యాయమూర్తి పన్ను అనేది విరాళం కాదు, ఇది తప్పనిసరిగా అంద‌రూ చెల్లించాల్సిందే. సామాజిక న్యాయం కోసం తాము ప్రయత్నిస్తున్నామని ప్రతిబింబించే న‌టీ నటులు పన్ను మినహాయింపులను అంగీకరించలేరు. తెర‌పైన హీరోలు కాకుండా నిజమైన హీరోలు కావాలని కోర్టు కూడా కఠినంగా తీర్పునిచ్చింది. అంతేకాకుండా, పిటిష‌న్‌లో తన వృత్తిని పేర్కొనకపోవడాన్ని న్యాయ‌మూర్తి ఖండించారు. ఈ వ్య‌వ‌హారంలో హీరో విజ‌య్ ప‌న్ను ఎగ‌వేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చెబుతూ కొంద‌రు సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేయ‌గా, ఆయ‌న అభిమానులు ఆయ‌న‌కు అండ‌గా నిలిచారు. నెట్టింట అప్ప‌ట్లో దీనిపై పెద్ద చ‌ర్చే జ‌రిగింది. అయితే హీరో విజయ్ అడిగినది రాజ్యాంగం ప్రకారం అతని హక్కు. సేవా పన్ను, కస్టమ్స్ పన్ను, దిగుమతి పన్ను అన్నీ ముడిపడి ఉన్నాయి కానీ అసాధారణ ప్రవేశ పన్నును చెల్లించాల‌ని సంబంధిత శాఖ అడిగిన‌ప్పుడు దాని నుంచి మిన‌హాయింపును కోరారు విజ‌య్‌. అది కూడా రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 226 ప్ర‌కారం. అయితే ఈరోజు మద్రాసు హైకోర్టులో ఈ కేసు విచార‌ణ‌కు వ‌చ్చిన‌ప్పుడు అప్ప‌టి జ‌డ్జి చేసిన వ్యాఖ్య‌లు త‌న‌నెంతో బాధించాయని విజ‌య్ త‌ర‌పున లాయ‌ర్ వాదించారు. ఈ క్ర‌మంలో న్యాయ‌మూర్తి త‌న‌ను సంబోధించిన తీరుని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. ఇప్పుడు ఆ విష‌యంలో నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. ‘‘మేము బకాయి పన్ను చెల్లించాం. కాబట్టి ఎంట్రీ ట్యాక్స్ కట్టలేదు.ఆ విషయంలో పన్ను మినహాయింపు కోరుతూ కేసు పెట్టారని న్యాయమూర్తి వ్యక్తం చేసిన అభిప్రాయం కూడా అనవసరం. ఆసంద‌ర్భంలో న్యాయమూర్తి న‌న్ను జాతి వ్య‌తిరేకిగా సంబోధించ‌డం నాకెంతో బాధ‌ను క‌లిగింది. నా కేసు విష‌యంలోనే కాదు.. హీరో ధ‌నుశ్‌, హీరో సూర్య విష‌యంలోనూ అలా బ‌హిరంగంగా వ్యాఖ్యానించారు”అని విజయ్ అన్నారు. తదనంతరం, ప్రత్యేక న్యాయమూర్తి అభిప్రాయాన్ని తొలగించాలని కోరుతూ విజయ్ కేసులో తీర్పు తేదీని పేర్కొనకుండా వాయిదా పడింది. సినిమాల విషయానికి వ‌స్తే ప్ర‌స్తుతం విజ‌య్‌, నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న బీస్ట్ అనే చిత్రంలో న‌టిస్తున్నారు. దీని త‌ర్వాత లొకేశ్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ఉంటుంది. అలాగే వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు నిర్మాత‌గా ఓ పాన్ ఇండియా సినిమా చేయ‌బోతున్నారు ద‌ళ‌ప‌తి విజ‌య్‌.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jBQdjc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...