Sunday, 26 September 2021

‘భ్రమ’లోకంలో తన తల్లి.. ఆమెను అలా చూసి సంబరపడ్డ ‘మహానటి’ కీర్తి సురేష్

మహానటి సోషల్ మీడియాలో ఎంత సందడి చేస్తారో అందరికీ తెలిసిందే. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో తన ఫాలోవర్లతో టచ్‌లో ఉంటారు. అలా కీర్తి సురేష్ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇక ఆమె ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి అందరికి తెలిసిందే. ఆమె తండ్రి సురేష్ కుమార్, తల్లి కుమార్ ఇద్దరు నటులే. అయితే తన తల్లితో కలిసి దిగిన ఫోటోలను కీర్తి తరచూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా కూడా తన తల్లికి సంబంధించిన పిక్‌ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. అది ‘’ అనే సినిమాలోనిది. హిందీలో సూపర్‌హిట్ సాధించిన ‘అంధాదూన్’ సినిమాకు ఇది అధికారిక రీమేక్. రవి కె చంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పృథ్వీ రాజ్‌సుకుమారన్ హీరోగా.. రాశీ ఖన్నా, ఉన్ని ముకుందన్, మమతా మోహన్‌దాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాలో మేనక సురేష్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతోంది. అయితే ఈ సినిమాలో తన తల్లి పాత్రకు సంబంధించి ఫోటోని పోస్ట్ చేసిన కీర్తి. ‘అమ్మా..భ్రమమ్ ప్రపంచంలో మీరు ఎలా ముగించారు.? పృథ్వీరాజ్ నేను చూస్తుంది నిజమేనా’ అంటూ ఆమె క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. అందులో తెలుగులో మహేష్‌బాబుతో ‘సర్కారు వారి పాట’తో పాటు.. తమిళంలో ‘అన్నాత్తే’, ‘పొన్నియిన్ సెల్వన్’, హిందీలో మైదాన్ అనే సినిమాల్లో నటిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ufbbZt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...