హీరోగా.. దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రిపబ్లిక్’. రాజకీయాల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కలెక్టర్గా కనిపించనున్నారు. రమ్యకృష్ణ, జగపతిబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం సాయి ధరమ్ తేజ్కు రోడ్డు ప్రమాదం అవ్వడం.. ఆయనకు అపోలో ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరగడంతో సినిమా విడుదలపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. అసలు ఈ సినిమా విడుదల అవుతుందా.. లేదా వాయిదా పడుతుందా అని అంతా అనుకున్నారు. కానీ ఈ అంచనాలను పక్కన పెడుతూ.. ఈ సినిమా అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ వేడుకను శనివారం (సెప్టెంబర్ 25న) నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పవర్స్టార్ పవన్కళ్యాణ్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన స్పీచ్లో పలు కీలక అంశాలు ప్రస్థావించారు. ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీపై చూపిస్తున్న వివక్షను ఆయన వేలెత్తి చూపించారు. ఇప్పటికైనా సినిమా పరిశ్రమపై ప్రభుత్వం తన ధోరణిని మార్చుకోవాలి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే దీనికి తెలుగు సినిమా హీరోల నుంచి మద్ధతు వస్తోంది. తాజాగా ‘ఆర్ఎక్స్100’ నటుడు కార్తికేయా కూడా పవన్కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మద్ధతు ఇచ్చారు. ‘నేను ఏ పార్టీకి మద్ధతు కానీ, ప్రతీకూలంగా కానీ ఉండటం లేదు. కానీ, పవన్కళ్యాణ్ మాట్లాడిన ప్రతి మాట సరైనదే. అది ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరి భావన. పవన్ సార్కి మద్ధతు తెలపడం.. నా బాధ్యతగా ఇప్పుడు భావిస్తున్నాను. ఆయన ఇండస్ట్రీలోని అందరి తరఫున మాట్లాడారు’ అంటూ కార్తికేయా ట్వీట్ చేశారు. అంతకు ముందు హీరో నాని కూడా పవన్కళ్యాణ్ స్పీచ్కు మద్దతు ఇస్తూ.. ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3EWA9S8
v
No comments:
Post a Comment