Friday, 3 September 2021

ముగిసిన ఈడీ విచారణ.. ఎఫ్ క్లబ్, నవదీప్‌తో రకుల్‌ లావాదేవీలపై ఫోకస్!

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్కువగా వినిపించే పేర్లు కెల్విన్, ఎఫ్ క్లబ్. ఈ ఎఫ్ క్లబ్ గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ టాప్ సెలెబ్రిటీలందరూ కూడా ఈ పబ్బుకు వెళ్తుంటారు. దీని మేనేజర్. వీటితో ఎంతో మంది సెలెబ్రిటీలకు సంబంధాలున్నాయని చెబుతుంటారు. అయితే మొన్న, నిన్న ఈడీ అధికారులు కెల్విన్ అంశం చుట్టూ పూరి జగన్నాథ్, ఛార్మీలకు ప్రశ్నలు సంధిస్తే.. నేడు రకుల్‌కు మాత్రం ఎఫ్ క్లబ్ వ్యవహారం చుట్టూ ప్రశ్నలు సంధించారని తెలుస్తోంది. ఎఫ్ క్లబ్, నవదీప్‌లతో జరిగిన లావాదేవీలపై రకుల్‌ను ప్రశ్నించి ఉక్కిరిబిక్కిరి చేసినట్టు తెలుస్తోంది. మామూలుగా అయితే సెప్టెంబర్ 6న విచారణకు హాజరు కావాల్సిన రకుల్ ముందుగానే హాజరు అయింది. సెప్టెంబర్ 6న హాజరు కాలేనని, వేరే తేదీకి వస్తానని చెప్పినా కూడా ఈడీ వినిపించుకోలేదు. అందుకే రకుల్ ఇచ్చిన డేట్ కంటే ముందుగానే వచ్చారు. నేటి విచారణను పూర్తి చేసుకుని వెళ్లిపోయారు. ఇక రకుల్ రాకతో ఈడీ ఆఫీస్, అక్కడి మీడియా ప్రాంగణ అంతా కూడా గందరగోళంగా మారింది. ఎఫ్ క్లబ్, దాని మేనేజర్ నవదీప్, రానాలతో రకుల్ చేసిన లావాదేవీలపై ఈడీ ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రకుల్.. బ్యాంకు ఖాతాలను ఈడీ తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. అయితే మళ్లీ ఏదైనా అవసరం ఉంటే.. ఈడీ అధికారులు పిలిస్తే.. విచారణకు సహకరిస్తానని రకుల్ చెప్పారట. మొత్తానికి రకుల్ వ్యవహారం మాత్రం నవదీప్ ఎంట్రీతోనే తేలిపోయేలా ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zHRVFH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...