ఓటీటీ చేతుల్లోకి సినిమాలు వెళ్తే ఎలా ఉంటుందో ఓ ఉదాహరణ. రెగ్యులర్గా సినిమా ప్రమోషన్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. దానికంటూ సపరేట్ పీఆర్ టీం ఉంటుంది. అంతా అదే చూసుకుంటుంది. కానీ సినిమాను ఓటీటీకి ఇచ్చాక.. పీఆర్ టీంకు చిక్కులు ఏర్పడుతుంటాయి. టీం, పీఆర్ టీం మధ్య గ్యాప్ పెరుగుతుంటుంది. ఇదే విషయం నిన్న టక్ జగదీష్ ఈవెంట్లో కనిపిస్తుంది. ఎన్నడూ లేనట్టుగా సినిమా ఈవెంట్లో నిర్మాతలకు చోటు దక్కలేదు. పైగా తెలుగు సినిమా, తెలుగు హీరో అయినా కూడా హిందీలో మాట్లాడాలంటూ కండీషన్ పెట్టేశారు. ఏ ప్రశ్నలు అడగాలి.. వాటికి ఏ భాషలో సమాధానం చెప్పాలో కూడా అమెజాన్ ప్రైమ్ నిర్ణయించేసింది. అలా మొత్తానికి నానికి నిన్న హిందీ భాషతో చిక్కులు ఏర్పడ్డాయి. అప్పటికీ కూడా తనకు వచ్చీరానీ భాషలో హిందీని మ్యానేజ్ చేసేశాడు. హిందీలో సమాధానాలు చెప్పేందుకు తడబడ్డా కూడా ప్రయత్నించాడు. ఇక చివరకు స్టేజ్ మీదకు ఎవరిని పిలవాలో కూడా వారే నిర్ణయించినట్టున్నారు. నిన్న ఎక్కడా కూడా టక్ జగదీష్ నిర్మాతల పేర్లు వినిపించలేదు. హీరో, దర్శకుడు మాత్రం తమ ప్రసంగాల్లో వారిని ప్రస్థావించారు. కానీ నిర్మాతలు మాత్రం స్టేజ్ మీదకు వచ్చి మాట్లాడే అవకాశం మాత్రం అమెజాన్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఇలా మొత్తానికి షైన్ స్క్రీన్ అధినేతలకు చేదు అనుభవమే ఎదురైనట్టు కనిపిస్తోంది. ఇక ఓటీటీకి అమ్ముకున్నాక ఇలాంటి తిప్పలు తప్పవేమో.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ya6Jz5
v
No comments:
Post a Comment