ఎప్పటిలాగే 'మా' ఎన్నికల వ్యవహారం మరోసారి హాట్ హాట్ చర్చలకు తెరలేపింది. ఇప్పటిదాకా ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. అధ్యక్ష పోటీలో ఐదుగురు బరిలోకి దిగడం సినీ వర్గాల్లో చాలా పెద్ద ఇష్యూ అయింది. అయితే ఈ పోటీలో విలక్షణ నటుడు , మంచు వారి వారసుడు బరిలోకి దిగుతున్నారు. వీరితో పాటు సీవీఎల్ఎన్రావు, జీవిత రాజశేఖర్, హేమ కూడా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకరిపై మరొకరు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘మా’ అధ్యక్ష బరిలో ఉంటున్నానని ప్రకాష్ రాజ్ ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి పరిస్థితులు రచ్చ రచ్చగా మారాయి. లోకల్, నాన్ లోకల్ అంశం తెరపైకి రావడంతో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పుకోవడం చూశాం. రీసెంట్గా నటి హేమ కూడా ప్రస్తుత అధ్యుక్షుడు నరేష్పై పలు సంచలన వ్యాఖ్యలు చేయడం.. దానికి కౌంటర్గా నరేష్.. నటి హేమపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొనడం.. ఇలా రోజు ఏదో ఒక దుమారం రేగుతూనే ఉంది. తాజాగా ‘మా’ వ్యవస్థాపక అధ్యక్షుడు మానిక్ ఈ ఎన్నికలపై పలు ఆసక్తికర వ్యాఖ్క్ష్యలు చేశారు. మా అసోసియేషన్ గౌరవానికి భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజుకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు 110 మంది సభ్యుల సంతకాలతో కూడిన లేఖలను కృష్ణంరాజుకు పంపించినట్లు మా వ్యవస్థాపక సభ్యుడు మానిక్ తెలిపారు. అయితే అధ్యక్షుడు నరేష్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మాత్రం సబబు కాదు అని.. అలా మాట్లాడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో మంచు విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి అని.. ఆయనకే 110 సభ్యుల మద్దతు ఉంది అని ఆయన పేర్కొన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VYFuXv
v
No comments:
Post a Comment