మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం ఎంతటి హాట్ టాపిక్గా మారుతోందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్య పరోక్షంగా మాటల యుద్దం ఎంతటి కాంట్రవర్సీ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు వర్సెస్ అన్నట్టుగా వ్యవహారం మారింది. నటి హేమ ఆడియో టేప్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. మా అసోసియేషన్ డబ్బులు మొత్తం ఖర్చు చేస్తున్నారంటూ నరేష్ మీద ఆరోపణలు చేశారు హేమ. ఇక హేమ చేసిన ఆరోపణలను ఖండిస్తూ నరేష్ కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టేశారు. జీవిత, నరేష్ ఇద్దరూ కలిసి హేమ చేసిన ఆరోపణలను ఖండించారు. ప్రతీది లెక్క చూపించారు. హేమ మీద చర్యలు తీసుకుంటామని నరేష్ చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు చర్యలు తీసుకున్నారు. మెగాస్టార్ కూడా ఈ విషయం మీద ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మా ప్రతిష్టను మసకబారేలా చేస్తున్నారు.. అలాంటి వారిని ఉపేక్షించవద్దని కృష్ణంరాజుకు చిరు రాసిన లేఖ ఓ రేంజ్లో వైరల్ అయింది. అయితే తాజాగా హేమ మీద క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. కమిటీ నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని నరేష్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే హేమకు క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేశారట. అసలే ఎన్నికల వ్యవహారం గురించి టాలీవుడ్లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తున్నాయి. త్వరగా ఎన్నికలు నిర్వహించాలని, అన్ని విషయాలు మీకు తెలుసు అంటూ కృష్ణంరాజుకు చిరంజీవి లేఖ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CCS3rU
v
No comments:
Post a Comment