Friday, 27 August 2021

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత నౌషద్ ఇకలేరు

సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు అందరినీ కుదిపేస్తున్నాయి. కరోనా సమయంలో ఎంతో మంది ప్రముఖులు మృతి చెందారు. కరోనా, ఇతర అనారోగ్య సమస్యలతో ఇండస్ట్రీ ప్రముఖులు స్వర్గస్తులయ్యారు. తాజాగా మాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు (ఆగస్ట్ 27) ఉదయం మరణించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్న నౌషద్ తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో మాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. నౌషద్ కేవలం నిర్మాతగానే కాకుండా ప్రముఖ పాకశాస్త్ర నిపుణుడు (చెఫ్)గా కూడా మంచి పేరు గడించారు. గత కొన్ని రోజులుగా ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడుతూ వచ్చిన ఆయన.. కేరళలోని తిరువళ్లలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా, రెండు వారాల క్రితమే నౌషాద్ భార్య షీబా తుది శ్వాస విడిచింది. నౌషద్ షీబా దంపతులకు 13 ఏళ్ల కుమార్తె నశ్వ ఉంది. నౌషాద్ మరణం సినీ పరిశ్రమ మరియు ఆహార వ్యాపారంలో ఉన్న ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ ప్రార్థిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WnRn9V
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...