Monday, 12 July 2021

బ్రహ్మానందాన్ని అలా వాడేసిన సైబర్ క్రైం పోలీసులు.. ఆరోగ్య శ్రీ, రైతు బంధు.. కాస్త జాగ్రత్త అంటూ!!

టెక్నాలజీ రోజు రోజుకూ విస్తృతం అవుతుండటంతో సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. మాయ మాటలు చెప్పి అందినకాడికి దోచుకుంటున్నారు. వాట్సాప్ లింక్స్, సోషల్ మీడియాలో ఆశ చూపే పోస్టులు పెట్టి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు, ఆన్ లైన్ మోసాలు చాలా వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రజలందరికీ ఈ ఆన్ లైన్ మోసాలపై అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతోంది సైబర్ క్రైం టీమ్. ఈ మేరకు తాజాగా బ్రహ్మానందాన్ని వాడేస్తూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు . సాధారణంగా మీమర్స్‌కి మేజర్ అసెట్. ఆయన సినిమాల్లోని డైలాగులతో, పేస్ ఎక్స్‌ప్రెషన్లతో రచ్చ చేస్తుంటారు మీమర్స్. వీటికి గిరాకీ కూడా బాగానే ఉంటుంది. ఫేస్‌బుక్, వాట్సాప్ లాంటి సామజిక మాధ్యమాల్లో బ్రహ్మి మీమ్స్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆయనతో అలాంటి ప్రయోగమే చేస్తూ ఆన్ లైన్ మోసాలపై అవగాహన కల్పించే మెసేజ్ పెట్టారు సైబర్ క్రైం పోలీసులు. ఆన్ లైన్ స్కీముల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి మోసపోవద్దంటూ ఓ పోస్టర్ షేర్ చేశారు. ఇందులో సత్యం రాజేష్, బ్రహ్మానందం మధ్య సంభాషణ నడిచినట్లు చూపిస్తూ సైబర్ నేరగాళ్లకు చిక్కొద్దంటూ మెసేజ్ ఇచ్చారు. అలాగే ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి , రైతు బంధు, పీఎం కిసాన్ ,డ్వాక్రా రుణాలు, ముద్ర రుణాలు ఇస్తామని చెప్పి మీ అకౌంట్ వివరాలు, ఓటీపీ /సివివి /ఎటిఎం పిన్‌ను చెప్పమని అడిగితే అది మోసం అని గ్రహించండి అని తెలిపారు సైబర్ క్రైం పోలీసులు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36wgs3G
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...