Friday, 23 July 2021

వ్యాక్సినేషన్ అంటూ రూ. లక్ష టోపీ.. ఎలా మోసపోయానంటే.. గుట్టు విప్పిన సురేష్ బాబు

ఎంతటి వారైనా సరే ఒక్కోసారి మోసపోతుంటారు. ఎంత తెలివి ఉన్నా సరే కొన్ని సందర్భాల్లో, కొన్ని సంఘటనల్లో బుర్ర కాస్త పనిచేయకపోవచ్చు. అలా టాలీవుడ్ అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఇలా ఎన్నో వ్యాపారాలను ఒంటి చేత్తో నడిపుతున్న ఓ కేటుగాడి చేతిలో మోసపోయారు. ఏప్రిల్‌లో జరిగిన ఈ ఘటనపై తాజాగా సురేష్ బాబు స్పందించారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడుతూ నాడు జరిగిన సంఘటన గురించి చెప్పుకొచ్చారు. కొవిడ్ వ్యాక్సీన్ లు ఉన్నాయని, తాను సప్లై చేస్తానని, ఇప్పటికే చాలా మందికి వేయించామని చెబుతూ డి సురేష్ బాబు దగ్గర లక్ష రూపాయలు ఓ మహా మాయగాడు కొట్టేశాడన్న సంగతి తెలిసిందే. టీకా కోసం లక్ష రూపాయలు ట్రాన్స్ ఫర్ చేయాలని అనడంతో వెంటనే సురేష్ బాబు పంపించారట. అయితే ఈ ఘటన గురించి తాజాగా సురేష్ బాబు పూస గుచ్చినట్టు వివరించారు. గవర్నమెంట్ అధికారిలా ఓ వ్యక్తి ఫోన్ చేశారు.. అఫీషియల్ వ్యక్తిలానే మాట్లాడారు.. ప్రభుత్వానికి సంబంధించి మెయిల్ ఐడీ పంపించాడు.. కరోనా వ్యాక్సిన్ వేస్తున్నాం.. మీ చుట్టూ పక్కలా కూడా మేం వేసేశామని అన్నాడు. దీని కోసం లక్ష రూపాయలు పంపించాల్సి ఉంటుందని అన్నాడు. గవర్నమెంట్ ఈమెయిల్స్ పంపించాడు. లక్ష రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేయమని మా మేనేజర్‌కి చెప్పాను. వాళ్లు లక్ష రూపాయలు పంపించారు. అది గవర్నమెంట్ సైటుకు వెళ్లడం లేదు సర్.. ఏదో పర్సనల్ అకౌంట్‌కి ట్రాన్స్ ఫర్ అవుతోందని మా మేనేజర్ అన్నాడు. నేను అతడ్ని తిట్టాను. చేసే వాళ్లను చేయనివ్వండి పని అని అన్నాను. ఆ తరువాత మా మేనేజర్‌ను అలా ఎందుకు అన్నానో అని పావుగంట తరువాత ఆలోచించాను. మళ్లీ ఒకసారి అకౌంట్ చెక్ చేయమనేసరికి మోసపోయాను అని తెలిసింది. అలా నేను కూడా ఏమీ తెలివైన వాడిని చెప్పుకోను. నాకే వ్యాక్సినేషన్ అని చెప్పి లక్ష రూపాయలు ఒకడు టోపీ పెట్టేశాడంటూ సురేష్ బాబు సరదాగా తనకు జరిగిన మోసం గురించి చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iC2ZNC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...