వివాదాస్పద తారల్లో ఒకరిగా తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది బాలీవుడ్ హాట్ బాంబ్ . అందాల విందుతో పాటు ఆమె చేసే కామెంట్స్ హాట్ హాట్ ఇష్యూలకు దారి తీస్తుంటాయి. ఏదైనా ఓపెన్గా మాట్లాడే ఈ బ్యూటీ.. గతంలో 2011 క్రికెట్ ప్రపంచకప్ సమయంలో బోల్డ్ కామెంట్స్ చేసి రచ్చ చేసిన సంగతి తెలిసిందే. గెలిస్తే బట్టలు లేకుండా మైదానంలో తిరుగుతానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే మళ్ళీ ఇప్పుడు అదే రేంజ్లో పూనమ్ మాట్లాడిన తీరు జనాల్లో హాట్ టాపిక్ అయింది. భారత్, మధ్య సౌథాంప్టన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జరుగుతోంది. ఈ రసవత్తర పోరు ఆఖరి అంకానికి చేరుకుంది. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ మ్యాచ్ గురించి స్పందించమని కోరగా.. మరోసారి రెచ్చిపోయింది పూనమ్. తనలోని బోల్డ్ క్వాలిటీని బయటకు తీస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. క్రికెట్ మొదలైందా..? జనం క్రికెట్ ఆడుతున్నారా..? ఈ సారి కూడా భారత జట్టు గెలిస్తే బట్టలు విప్పేస్తానని మళ్లీ చెప్పాలా? అంటూనే ఈ మ్యాచ్ గురించి తనకు తెలియదని.. ఇంటికి వెళ్లి తెలుసుకుంటానని చెప్పింది. దీంతో పూనమ్ చేసిన ఈ కామెంట్స్పై ఆమె భర్త రియాక్ట్ అవుతూ.. ‘నీకు బదులుగా ఈ సారి నేను నగ్న ప్రదర్శన చేస్తా’ అంటూ క్రేజీగా బదులిచ్చాడు. ఆయన వ్యాఖ్యలపై మళ్ళీ పూనమ్ స్పందిస్తూ ‘వద్దులే నువ్వు చేస్తే ఇండియా ఓడిపోతుంది’ అని చెప్పింది. దీంతో ఈ ఇష్యూ వైరల్ అయింది. పైగా తన మాటలను సమర్ధించుకున్న పూనమ్.. నా దేశం గెలవాలని కోరుకుంటున్నా, అందులో తప్పేం ఉంది అనడం విశేషం. అడపాదడపా సినిమాలు చేస్తున్న పూనమ్ పాండే.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటూ అర్ధనగ్న ప్రదర్శనలతో ఆన్ లైన్ వేదికలను హీటెక్కిస్తోంది. ఆమె పోస్ట్ చేస్తున్న హాట్ ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xNHwqD
v
No comments:
Post a Comment