ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ టాపిక్ వైరల్ అవుతోంది. ప్రతీ ఏడా టైమ్స్ ప్రకటించే డిజైరబుల్ లిస్ట్ ఎంతగా హైలెట్ అవుతుందో అందరికీ తెలిసిందే. మోస్ట్ డిజరైబుల్ వుమెన్ లిస్ట్ ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇందులో దక్షిణాది నుంచి కొద్దిమందికే చోటు దక్కింది. అయితే రష్మిక మందాన్న మాత్రం ప్రతీ లిస్ట్లో దుమ్ములేపేశారు. బెంగళూరు, చెన్నై, నేషనల్ వైడ్గా మోస్ట్ డిజైరబుల్ లిస్ట్లో రష్మిక చోటు దక్కించుకున్నారు. ఇక సైతం దుమ్ములేపేశారు. అయితే ఈ మోస్ట్ డిజైరబుల్ లిస్ట్లో టాప్ ప్లేస్ను కైవసం చేసుకున్నారు. గత ఏడాది మీడియా మొత్తం రియా చక్రవర్తి చుట్టే తిరిగింది. సుశాంత్ సింగ్ కేసు, డ్రగ్స్ కేసు అంటూ రియా చక్రవర్తి వార్తల్లో నిలిచారు. నేటికీ ఏదో ఒక విషయంలో రియా చక్రవర్తి వార్తల్లో నిలుస్తుంటారు. గత ఏడాది వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ అవ్వడంతో ఇప్పుడు ఇలా మోస్ట్ డిజైరబుల్ లిస్ట్లో మొదటి స్థానంలో నిల్చున్నారు. ఇక దక్షిణాది నుంచి రష్మిక మందాన్న, సమంత, మాళవిక మోహనన్, కళ్యాణి ప్రియదర్శిని వంటివారు చోటు దక్కించుకున్నారు. రష్మికకు 21వ స్థానం, మాళవికకు 29వ స్థానం, సమంతకు 34వ స్థానం, కళ్యాణి ప్రియదర్శినికి 41వ స్థానం దక్కింది. అలా మొత్తంగా రష్మిక మందాన్న, సమంత మధ్య మాత్రం చాలా గ్యాప్ ఉంది. రష్మికకు ఆల్రెడీ నేషనల్ క్రష్ అన్న ట్యాగ్ ఉంది. సమంత కంటే రష్మికకు ఉత్తరాదిన మంచి ఫాలోయింగ్ ఉంది.అందుకే ఈ జాబితాలో రష్మిక సమంత కంటే చాలా ముందున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2T6tjWT
v
No comments:
Post a Comment