Thursday, 24 June 2021

రంగంలోకి దూకేందుకు పవర్ స్టార్ రెడీ.. షూటింగ్‌లతో పవన్ కళ్యాణ్ బిజీ!

పవర్ స్టార్ ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నారు. కరోనా వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. రాజకీయ అంశాలపైనా ఎక్కువగా స్పందించడం లేదు. అవసరం మేరకు ఏదైనా ఉంటే అధికారికంగా ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ నిర్మాతలు మాత్రం ఫుల్ టెన్షన్‌లో ఉన్నారని తెలుస్తోంది. కానీ వారందరికీ ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది. త్వరలోనే పవన్ కళ్యాణ్ సెట్స్ మీదకు అడుగుపెట్టబోతోన్నట్టు సమాచారం. అసలే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వరుసబెట్టి చిత్రాలను ఓకే చేశారు. మామూలుగా అయితే వకీల్ సాబ్ తరువాత పవన్ కళ్యాణ్ ఫుల్ స్వింగ్‌లో షూటింగ్‌లను పూర్తి చేయాలని భావించారు. కానీ వాటన్నంటిని సెకండ్ వేవ్ దెబ్బ కొట్టేసింది. అలా ప్లానింగ్స్ అన్నీ కూడా మూలనపడ్డాయి. అయితే ఇప్పుడు మాత్రం అంతా కూడా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో షూటింగ్‌లు కూడా మొదలుపెట్టేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ముందుగా అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ షూటింగ్‌లో పాల్గొన బోతోన్నారని టాక్. ఈ క్రమంలో జూలై 11న సెట్స్ మీదకు పవన్ కళ్యాణ్ రాబోతోన్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తరువాత మళ్లీ వెంటనే డైరెక్టర్ క్రిష్ సినిమా షూటింగ్‌లొ బిజీ అవ్వనున్నారు. ఇవన్నీ అనుకున్నట్టు పూర్తయితే తరువాత హరీష్ శంకర్ ప్రాజెక్ట్ మొదలుపెట్టనున్నట్టు టాక్. అయితే ముందుగా అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నట్టు సమాచారం. రానా ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ చంద్ర సిద్దార్థ తెరకెక్కిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vWsuO2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...