2024 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.. కుల సమీకరణాలు.. సీట్ల కేటాయింపులు.. ప్రత్యర్థుల బలాబలాలు.. పార్టీ సాధ్యాసాధ్యాలపై గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఏపీలో బీజేపీ బలమైన పార్టీగా అవతరించాలంటే బలమైన సామాజిక వర్గంతో పాటు.. బలమైన నాయకుడిగా ఉన్న తప్ప వేరే మార్గం ఏమీ కనిపించకపోవడంతో అధినేతను బీజేపీ ప్రతినిధిగా మార్చేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోందని.. దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వబోతున్నారంటూ గత రెండు మూడు రోజులుగా సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ దశగా అడుగులు పడుతుండటంతో ఏపీ నుంచి సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, పురుందేశ్వరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఏపీలో సామాజిక సమీకరణాలే పవర్ని డిసైడ్ చేస్తాయి కాబట్టి.. పవర్ కోసం పవన్ని రంగంలోకి దించి.. ఇప్పటికే బీజేపీతో జతకట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ నేతలు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్ని ఎదుర్కోవాలంటే.. జనాకర్షణ ఉన్న పవన్ అవసరమని.. అతనికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని ఆర్ఎస్ఎస్లో కీలకంగా వ్యవహరించే ముఖ్యనేత బీజేపీ అధినాయకత్వం వద్ద పట్టుపడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే బీజేపీతో జతకట్టడం వేరు.. బీజేపీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగడం వేరు. రెండోదే జరిగితే.. జనసేనను బీజేపీలో విలీనం చేయాల్సిందే. అప్పట్లో అన్న చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపేసి కేంద్ర మంత్రి అయినట్టుగానే చేయాల్సి ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ అలా పదవి కోసం పార్టీని విలీనం చేస్తారా? దానికి జనసైనికులు సపోర్ట్ చేస్తారా? ఎంతో కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి పదవి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుండగా.. మూవీ క్రిటిక్ మహేష్ కత్తి షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘ఏం ‘పీకే’డని ఇస్తార్రా.. కేంద్రమంత్రి పదవి?? మీరు మీ భ్రమలు కాకపోతేను’ అంటూ పరోక్ష విమర్శలు చేశారు కత్తి మహేష్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zvsozQ
v
No comments:
Post a Comment