Sunday, 6 June 2021

మానవజాతి చేష్టలకు విసుగెత్తిపోయినట్టుంది.. వింత ఘటనపై యాంకర్ రష్మీ రియాక్షన్

రావణాసురుడ శివలింగాన్ని మోసుకెళ్తూ ఉంటే.. మధ్యలో కిందపెట్టేస్తాడు. అప్పుడు అది క్షణక్షణానికి పెరిగిపోతూ ఉంటుంది. చివరకు అది మోయలేనంత బరువు అవుతంది. ఈ కథను అందరూ చదివే ఉంటారు. తెలుగు వారు అయితే ఎన్టీఆర్ భూకైలాష్ సినిమాలో ఈ సీన్‌ను చూసి ఉంటారు. అచ్చం అదే మాదిరిగా మెక్సికోలో ఓ ఘటన జరిగింది. పచ్చని పంట పొలాల మధ్యలో ఓ రంధ్రం ఏర్పడింది. మొదట అది చిన్న రంధ్రంగానే ఉంది. కానీ రోజురోజుకూ అది పెరుగుతూ అగాథంలా మారుతోందట. మొదట ఉరుములు మెరుపులు వచ్చాయని, అవి సాధారణమైనవే అని మొదట అనుకున్నట్టు అక్కడి స్థానికులు చెప్పుకొచ్చారు. భూమి పగుళ్లు, దాని నుంచి నీటి బుడగలు వచ్చాయట. అయితే మొదట చిన్నగా ఆ ఉన్న రంధ్రం ఇప్పుడు పెద్దది అయిందట. దాదాపు 300 ఫీట్ల వ్యాసార్థం ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై అందరూ విస్మయం చెందుతున్నారు. ఈ ప్రకృతి వైపరిత్యాన్ని ఎవ్వరూ అంచనా వేయలేకపోతోన్నారు. దీనిపై యాంకర్ స్పందించారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మీ.. ఇలాంటి విషయాలపై స్పందిస్తుంటారు. జంతువులు, పక్షులు, ప్రకృతి వంటి విషయాలపై రష్మీకి ప్రత్యేక శ్రద్ద ఉంటుంది. ఈ సింక్ హోల్ ఘటనపై రష్మీ స్పందిస్తూ.. మానవజాతికి మరో హెచ్చరికలా ఉంది. మనషులు చేసే చేష్టలకు విసుగెత్తినట్టుంది..భూమాతకు కోపం వస్తున్నట్టుంది.. అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రష్మీ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34VuT0m
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...