కరోనా మహమ్మారి మరోసారి వీరవిజృంభణ చేస్తోంది. ఫస్ట్ వేవ్ కంటే భయంకరంగా సెకండ్ వేవ్ ఉండటంతో జనం ఆందోళన చెందుతున్నారు. నిత్యం లక్షల్లో కేసులు నమోదవుతుండగా, వేలల్లో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. కనీసం ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సీజన్ దొరకని పరిస్థితి నెలకొంది. జనజీవనం అస్తవ్యస్థంగా మారి అందరిలోనూ గుబులు మొదలైంది. ఈ తరుణంలో RRR అంతా కలిసి కరోనాను తరిమికొట్టడానికై తగు సూచనలిచ్చారు. కరోనా జాగ్రత్తలు చెబుతూ అవగాహన కల్పించారు. ఈ మేరకు ప్రత్యేకమైన వీడియో రిలీజ్ చేసి రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ఈ వీడియోలో నటీనటులు రామ్ చరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవగన్, హీరోయిన్ అలియాభట్, దర్శకుడు రాజమౌళి వివిధ భాషల్లో ప్రజలకు కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు, కన్నడ , తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, అవసరమైతే తప్ప బయటకు రాకూడని, అందుబాటులో ఉంటే వెంటనే కరోనా వాక్సిన్ తీసుకోవాలని కోరారు. ఇవే మన వద్ద ఉన్న ఆయుధాలని చెప్పారు. మనకోసం, మన కుటుంబం కోసం, స్నేహితుల కోసం, చుట్టూ ఉన్నవారికోసం, దేశం కోసం జాగ్రత్తలు వహించాలని RRR అంతా ఒక్కొక్కరుగా విజ్ఞప్తి చేశారు. రాజమౌళి రూపొందిస్తున్న RRR సినిమాను భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్నారు బడా నిర్మాత డీవీవీ దానయ్య. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తుండగా, కొమురం భీం రోల్ ఎన్టీఆర్ పోషిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uuaZEY
v
No comments:
Post a Comment