Monday, 10 May 2021

త్వరలో ‘జాంబీ రెడ్డి’ సీక్వెల్.. స్క్రీప్ట్ పనులు ప్రారంభించిన ప్రశాంత్ వర్మ!

ప్రస్తుత యువ దర్శకుల్లో వైవిధ్యమైన సినిమాలు తీస్తూ.. ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు . తొలి చిత్రం ‘ఆ!’తోనే అతను ఆడియన్స్‌ని మెప్పించాడు. ఓ డిఫరెంట్ జోనర్‌లో ఈ సినిమాను రూపొందించి తన సత్తా నిరూపించుకున్నాడు. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా అతను తెరకెక్కించిన ‘కల్కీ’ సినిమా కూడా మంచి హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో స్క్రీన్‌ప్లేతో పాటు విజువల్స్, మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆ తర్వాత ప్రశాంత్ తెరకెక్కించిన చిత్రం ‘’. తెలుగులో జాంబీ జోనర్‌లో వచ్చిన తొలి చిత్రం కావడంతో సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది. హీరోగా తేజ సజ్జాను పరిచయం చేస్తూ.. విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది. అయితే ఈ మధ్యే ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా 9.7 టీఆర్‌పీ రేటును సాధించింది. వెండితెరపై కంటే బుల్లితెరపైనే సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా సీక్వెల్ రూపొందుతుందంటూ.. చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యే జాంబి రెడ్డి సీక్వెల్‌కి ప్రశాంత్ స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించాడని సమాచారం. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ‘దటీజ్ మహాలక్ష్మీ’ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకొని ఎప్పటినుంచో విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం అతను ‘ఒక గన్ను 6 బులెట్లు’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దీంతో పాటే జాంబీ రెడ్డి స్క్రిప్ట్ పనులు కూడా వేగంగా చేస్తున్నాడట ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం తను కమిట్ అయిన సినిమాలు పూర్తయిన తర్వాత జాంబీరెడ్డి-2 సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3y36HGH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...