Sunday, 16 May 2021

అన్ని సినిమాలు హైదరాబాద్‌కే.. ప్రభాస్‌ ఏ సినిమాతో స్టార్ట్ చేస్తాడో మరీ..!

ఇప్పుడు ఎక్కడ చూసిన కరోనా మహమ్మారి విలయతాండవమే కనిపిస్తోంది. మొదటి దశతో పోలిస్తే.. రెండో దశలో వైరస్ మరింత భయంకరంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలో దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించారు. దీంతో సినిమా షూటింగ్‌లు, విడుదలలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ముంబైలో కరోనా ప్రభావం తీవ్రస్థాయిలో ఉండటంతో.. అక్కడ చేయాల్సిన పలు సినిమాలను హైదరాబాద్‌కి షిఫ్ట్ చేసి ఇక్కడ షూటింగ్ చేస్తున్నారు. ఇందులో యంగ్ రెబల్‌స్టార్ నటిస్తున్న చిత్రాలే ఎక్కువగా ఉన్నాయి. బాహుబలి వంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రభాస్ నటించిన లాస్ట్ చిత్రం ‘సాహో’ ఫర్వాలేదు అనిపించినా.. కలెక్షన్లు భారీగానే రాబట్టింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్‌’ అనే సినిమాలో చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినట్లు సమాచారం. ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆదిపురుష్‌’లో, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘’ అనే పాన్ ఇండియా సినిమాల్లో అతను నటిస్తున్నాడు. అయితే షెడ్యూల్ ప్రకారం ‘’ షూటింగ్ ముంబైలో జరగాలి. కానీ కారణంగా షూటింగ్‌ను హైదరాబాద్‌కి షిఫ్ట్ చేశారు. అయితే ‘సలార్’ సినిమా కూడా హైదరాబాద్‌లోనే షూటింగ్ చేయాలని ఆ చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ‘కేజీఎఫ్-2’లోని ప్రధాన యాక్షన్ సన్నివేశాలు హైదరాబాద్‌లోనే చిత్రీకరించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.. దీంతో సలార్ కూడా ఇక్కడే షూటింగ్ చేయాలని అతను ప్లాన్ చేస్తున్నాడట. దీంతో కరోనా ఉధృతి కాస్త.. తగ్గి మళ్లీ షూటింగ్‌లు ప్రారంభమైతే.. ప్రభాస్ ‘సలార్’ సినిమాతోనే మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటాడని టాక్ బలంగా వినిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SSYC7A
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...