అందంతో పాటు గొప్ప మనస్సు ఉన్న నటి . ఎన్నో సినిమాల్లో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆమె సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటుంది. గతంలో ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రణీత.. గత ఏడాది కారణంగా ఏర్పడిన తీవ్ర సంక్షోభంతో రియల్ హీరోయిన్ అనిపించుకుంది. లాక్డౌన్ సమయంలో ఆకలితో అలమటిస్తున్న ఎందరికో ఆమె ఆహారం అందించింది. తన సొంత ఖర్చుతో అన్నదాన కార్యక్రమాలను చేపట్టింది. ఈ క్రమంలో ప్రణీతపై ప్రశంసల వర్షం కురిసింది. రెండో దశలో కరోనా వైరస్ మరింత ఉగ్రరూపం దాల్చింది. ప్రతీ రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదు కావడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. రోజువారిగా వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే దేశ వ్యాప్తంగా ఏర్పడిన ఆక్సిజన్ కొరత కారణంగానే ఈ మరణాలు సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తమ వద్ద ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ.. అవసరంలో ఉన్న వారికి సహాయం అందించేందుకు సెలబ్రిటీలు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రణీత కూడా తన వొంతు సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. తొలి దశలో ఎందరికో ఆహారం అందించన ఆమె.. ఈసారి అవసరం కావడంతో.. ఆ పనిలోకి దిగింది. తన ఛారిటీ ద్వారా ఆక్సీజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందిస్తున్నట్లు ప్రణీత తెలిపింది. దీని కోసం రూ.లక్ష విరాళంగా ఇస్తున్నట్లు ఆమె ప్రకటించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దారుణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పిన ఆమె.. ఇలాంటి సమయంలో సహాయం అందించేందుకు ప్రతీ ఒక్కరు ముందుక రావాలని కోరింది. ఇక ప్రణీతతో పాటు సహాయం అందించేందుకు నెటిజన్లు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. ఆమె మద్దతు తెలుపుతూ.. తమకు తోచిన సహాయం చేస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tsj8bM
v
No comments:
Post a Comment