కోలీవుడ్, టాలీవుడ్లో ఫేమస్ నటి అయినా కూడా నందమూరి బాలకృష్ణ హీరోయిన్గానే ఎక్కువగా గుర్తిస్తుంటారు. అలా వేదికను బాలయ్య హీరోయిన్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతుంటారు. సోషల్ మీడియాలో వేదిక చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అందాలను ఆరబోయడంలో వేదిక స్పెషల్ పట్టాను పొందినట్టు అనిపిస్తుంది. డ్యాన్స్ వీడియోలు, హాట్ హాట్ ఫోటోలతో వేదిక నెట్టింట్లో తెగ సందడి చేస్తుంటారు. అయితే తాజాగా వేదిక చేసిన ఓ పోస్ట్ అందరినీ కదిలిస్తోంది. అందులో వేదిక వాడిన పదం వింటుంటే.. బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ ఒకటి గుర్తుకు వస్తోంది. శ్రీమన్నారాయణ సినిమాలోని ట్రబుల్ డైలాగ్ అందరికీ గుర్తుండేఉంటుంది. అదే రీతిలో తాజాగా వేదిక ఓ పోస్ట్ చేశారు. అయితే ఆమె పోస్ట్ చేసిన ఉద్దేశం మాత్రం ఎంతో గొప్పది. కరోనా లాంటి కష్టకాలంలో ఎంతో మంది మానవత్వంతో ముందుకు వస్తున్నారు. సేవ చేస్తూ ఉన్నారు. అలా సహాయం చేసేందుకు ముందుకు వస్తోన్న వారిని ఉద్దేశించి వేదిక చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఎవరో ఒకరికి ఆక్సిజన్ అవసరం పడింది.. ఎవరో ఒకరు ఎవరికో ఒకరికి మెసెజ్లు పెడుతున్నారు.. ఎవరో ఒకరు అది చదువుతున్నారు.. ఎవరో ఒకరు వాటిని చూస్తున్నారు.. ఎవరో ఒకరు ఫార్వర్డ్ చేస్తున్నారు.. ఎవరో ఒకరు వాటిలో నిజానిజాలు చెక్ చేస్తున్నారు.. ఎవరో ఒకరు వారిని కాంటాక్ట్ అవుతున్నారు.. ఎవరో ఒకరు సమాధానం ఇస్తున్నారు.. ఎవరో ఒకరు సిలిండర్లను కలెక్ట్ చేస్తున్నారు.. ఎవరో ఒకరు ఆక్సిజన్ను నింపుతున్నారు.. ఎవరో ఒకరు వాటిని డెలివరీ చేస్తున్నారు.. ఎవరో ఒకరు ప్రాణాలు నిలుస్తున్నాయి. ఇదంతా ఎవరో ఒకరు ఎవరికో ఒకరికి సాయపడుతుండటం వల్లే. ఇలాంటి కష్టకాలంలోనే అలా ఎంతో మందిలోంచి ఎవరో ఒకరు ముందుకు రావాలి.. సాయం చేయాలి.. మానవత్వాన్ని బతికించాలి.. అలా ఎవరో ఒకరిలా ఉంటూ.. మానవత్వాన్ని బతికిస్తూ ఉండే ఒకరిలా బతకాలి.. ఎవరి ఒకరికి ఎవరో ఒకరి నుంచి థ్యాంక్స్ అంటూ వేదిక ఎమోషనల్ అయ్యారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33pU0YG
v
No comments:
Post a Comment