రెండో దశలో కరోనా వైరస్ యావత్ భారతదేశాన్ని హడలెత్తిస్తుంది. ప్రతీ రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రస్తుతం మూడో దశలో ఉంది. తొలుత కరోనా వారియర్లకు.. ఆ తర్వాత 45 సంవత్సరాల పైబడిన వారికి.. ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికీ కోవిడ్ టీకా అందిస్తున్నారు. ఈ క్రమంలో సినీ నటి శుక్రవారం తీసుకుంది. ముంబైలోని నానావతి ఆస్పత్రిలో ఆమె భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి వ్యాక్సిన్ పొందింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కాజల్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఏర్పాట్లు చేసిన బృహన్ ముంబై కార్పొరేషన్కు కాజల్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. కాజల్ వ్యాక్సిన్ తీసుకున్న సమయంలో అక్కడే ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ను కలుసుకుంది. ఈ సందర్భంగా ఆయన్ని కలవడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ కాజల్ తెలిపింది. ఇక కాజల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోంది. దీంతో తమిళంలో ‘గోష్టి’ సినిమా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. ఈ మధ్య కాజల్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. హాట్స్టార్లో విడుదలైన ‘లైవ్ టెలికాస్ట్’ అనే వెబ్సిరీస్లో ఆమె ప్రధాన పాత్రలో నటించింది. ఈ సిరీస్కి మంచి రెస్పాన్స్ రావడంతో వెబ్ సిరీస్లు చేసేందుకు కాజల్ మరింత ఆసక్తి కనబరుస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3erFBRV
v
No comments:
Post a Comment