రెండో దశలో కరోనా వైరస్ ప్రభావం సినీ తారలపై గట్టిగానే ఉంది. బాలీవుడ్లో అమీర్ ఖాన్, మాధవన్, విక్కీ కౌశల్, భూమీ ఫడ్నేకర్, ఆలియా భట్, కత్రినా కైఫ్ తదితరులు వైరస్ బారిన పడి కోలుకున్నారు. ఇక టాలీవుడ్లో పవన్కళ్యాణ్, అల్లు అర్జున్, పూజా హెగ్డే తదితర ప్రముఖులకు వైరస్ సోకింది. ఈమధ్యే బాలీవుడ్ నటి దీపికా పదుకొనే కుటుంబం మొత్తానికి వైరస్ సోకిన విషయం తెలిసిందే. తాజాగా ‘సాహసవీరుడు సాగరకన్య’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి కుటుంబంలో కరోనా కలకలం సృష్టించింది. శిల్పాశెట్టి మినహా ఆమె కుటుంబంలో అందరికీ వైరస్ సోకింది. ఆమె అత్తామామలు, తల్లి, పిల్లలు సమిషా, వియాన్, భర్త రాజ్ కుంద్రాలకు వైరస్ సోకినట్లు ఆమె సోషల్మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘గత పది రోజులు మాకు చాలా కష్టంగా గడిచాయి. మా అత్తామామలకు ముందు కోవిడ్-19 పాజిటివ్గా వచ్చింది. వారి తర్వాత సమిషా, వియాన్, మా అమ్మ చివరిగా రాజ్ ఒకరి తర్వాత ఒకరు వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం వాళ్లు కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఎవరి గదిలో వాళ్లు ఐసోలేషన్లో ఉంటున్నారు. అంతేకాక.. మా ఇంట్లో పని చేసే వారిలోనూ ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దేవుడి దయతో అందరూ కోలుకొనే దశలో ఉన్నారు. నా రిపోర్టులు మాత్రం నెగటివ్గా వచ్చాయి. బీఎంసీ, అధికారులు విధించిన అన్ని నిబంధనలు పాటిస్తున్నాము. మాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. దయచేసి మాస్క్ వేసుకోండి, జాగ్రత్తగా ఉండండి’’ అంటూ శిల్పా పేర్కొంది. ఇక రెండో దశలో కరోనా దేశంలో విలయ తాండవం ఆడుతోంది. ప్రతీ రోజు లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా రోగులతో ఆస్పత్రులు అన్ని నిండిపోతున్నాయి. సరైన సమయానికి వైద్య సౌకర్యం అందక.. కరోనా రోగులు ప్రాణాలు విడుస్తున్నారు. కొందరు తమకు కరోనా సోకిందనే భయంతోనే కొందరు మరణిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరికి వాళ్లు స్వీయనియంత్రణ పాటించాలని.. అవసరం ఉంటే తప్పా బయటకు రావొద్దంటూ ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2R549qV
v
No comments:
Post a Comment