Monday, 17 May 2021

విరాట్ కోహ్లీపై రష్మిక సెన్సేషనల్ కామెంట్స్.. ఆర్‌సీబీ అంటే ఇష్టం అంటూనే..

తన అందంతో దక్షిణ పరిశ్రమను ఓ ఊపు ఊపేసిన .. ప్రస్తుతం బాలీవుడ్‌లో తన ప్రతిభ చాటేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే నేషనల్‌ క్రష్‌గా గుర్తింపు సాధించిన ఈ బ్యూటీ.. బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్ బచ్చన్‌తో కలిసి సినిమా చేస్తోంది. దీంతో పాటు దక్షిణ సినీ పరిశ్రమల్లో కూడా మేజర్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో రష్మిక తరచూ వార్తల్లో నిలుస్తోంది. లేటెస్ట్‌గా ఆమె టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆమె సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే క్రికెట్‌ను కూడా రెగ్యులర్‌గా ఫాలో అవుతుంది రష్మిక. ముఖ్యంగా ఐపీఎల్‌ అంటే తనకు పిచ్చి అని ఆమె పేర్కొంది. ఇటీవల సోషల్‌ మీడియాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. ఐపీఎల్‌లో తన ఫేవరెట్‌ జట్టు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అని చెప్పుకొచ్చింది. కానీ, తన ఫేవరేట్ క్రికెటర్ కాదని ఆమె స్పష్టం చేసింది. విరాట్ కోహ్లీ కంటే.. టీం ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె తెలిపింది. ధోనీ బ్యాటింగ్, కీపింగ్, కెప్టెన్సీ తనకు ఎంతో ఇష్టమని.. అతను మాస్టర్ క్లాస్ ప్లేయర్ అని ఆమె చెప్పింది. ఇక రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె ఓ పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. దీంతో పాటు.. బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్‌తో ఓ సినిమా, సిద్ధార్త్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మిషన్ మంజు’ అనే సినిమాల్లో ఆమె నటిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uUWj1W
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...