జూనియర్ హీరోగా, దర్శకత్వంలో రూపొందిన ‘జనతా గ్యారేజ్’ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లోనే ఈ సినిమా ఓ హైలైట్గా నిలిచింది. అయితే త్వరలో ఈ కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళీ దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత కొరటాల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై కళ్యాణ్రామ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మలయాళం మెగాస్టార్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు ఫిలిమ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తన గత చిత్రాల్లో కూడా కొరటాల ఇతర ఇండస్ట్రీలకు చెందిన స్టార్ యాక్టర్లను ప్రధాన పాత్రలో తీసుకున్నారు. 'మిర్చి' సినిమా కోసం ఆయన సత్యరాజ్ను తీసుకున్నారు. ఆ తరువాత చేసిన 'జనతా గ్యారేజ్' కోసం మోహన్ లాల్ను.. 'భరత్ అనే నేను' కోసం శరత్ కుమార్ ను తీసుకొచ్చారు. ప్రస్తుతం చేస్తున్న 'ఆచార్య' కోసం బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తాను ఒక కీలకమైన పాత్ర కోసం తీసుకున్నారు. ఇదే పద్దతిలో ఎన్టీఆర్30లో మమ్ముట్టీని ఓ ప్రధాన పాత్ర కోసం అనుకుంటున్నట్లు టాక్. కొంతకాలం క్రితం ‘యాత్ర’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాము మమ్ముట్టీ.. ఇప్పుడు ఈ సినిమతో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆయన నటనతో సిద్ధమైనట్లు తెలుస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RquEr7
v
No comments:
Post a Comment